వైభవంగా పండిత సదస్యం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా పండిత సదస్యం

Apr 1 2026 8:42 AM | Updated on Apr 1 2026 8:42 AM

ఆత్రేయపురం: కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా మంగళవారం నాలుగో రోజు వైభవంగా పండిత సదస్యం నిర్వహించారు. స్వామివారికి చతుర్వేద పండితులు మహదాశీర్వచనం చేశారు. ఉదయం స్వామివారి మేలుకొలుపు, తీర్థం బిందె తెచ్చుట, విశేషార్చన, నిత్య హోమాలు, బలి హరణం, ద్రవిడ వేద పారాయణ, సాగాయి. మధ్యాహ్నం విష్వక్సేన పూజ, అష్టదిక్పాలక ఆరాధన, సదస్యం నిర్వహించారు. రాత్రి ప్రధాన హోమాలు, బలి హరణము, నీరాజన మంత్రపుష్పాల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో నల్లం సూర్యచక్రధరరావు వేద పండితులను సత్కరించారు. ఆలయ అర్చక కమిటీ సభ్యుడు వాడపల్లి శేషావతారం, కమిటీ సభ్యుడు శిష్టా సూర్య కుటుంబరావు, గ్రామ సర్పంచ్‌ పోచిరాజు బాబురావు, సూర్యకుమారి దంపతులు, ఆలయ కమిటీ సభ్యులు, సేవా కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement