కార్తికం.. శుభారంభం | - | Sakshi
Sakshi News home page

కార్తికం.. శుభారంభం

Oct 23 2025 6:16 AM | Updated on Oct 23 2025 6:16 AM

కార్త

కార్తికం.. శుభారంభం

విత్ర కార్తిక మాసం ప్రారంభమైన వేళ బుధవారం జిల్లావ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. పరమ మంగళకరమైన బ్రాహ్మీ ముహూర్త కాలంలో భక్తులు పావన గోదావరితో పాటు కాలువలు, ఆలయాల పుష్కరిణుల్లో కార్తిక పుణ్యస్నానాలు ఆచరించారు. ‘ఓం నమఃశివాయ’, ‘హరహర మహాదేవ శంభోశంకర’ నామస్మరణతో ఆలయ ప్రాంగణాలు ప్రతిధ్వనించాయి. భక్తులు అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి, గంగమ్మ తరగలపై విడిచిపెట్టారు. శివాలయాలకు వెళ్లి పరమేశ్వరుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. రేవులు, ఆలయాల్లో దీపారాధనలు చేశారు. ఆ దీపకాంతుల్లో దైవసన్నిధానాలు దేదీప్యమానంగా ప్రకాశించాయి. రాజమహేంద్రవరంలో గోదావరి గట్టున ఉన్న శ్రీ ఉమా మార్కండేయేశ్వర స్వామి వారికి అభిషేకాలతో పాటు ధన్వంతరి సహిత రుద్రహోమం నిర్వహించారు.

– సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం)

కార్తికం.. శుభారంభం1
1/1

కార్తికం.. శుభారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement