
● బుడిబుడి నడక్లు
తొలకరి వర్షాలు మొదలు కావడంతో ఖరీఫ్ పనులు ప్రారంభం కానున్నాయి. రబీ అనంతరం ఖాళీగా ఉన్న పొలాల్లో సాగు పనులకు రైతులు శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఒంగోలు, నెల్లూరు, సూళ్లూరుపేట తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో బాతులను వాటి కాపరులు మన ప్రాంతానికి తీసుకువచ్చారు. పొలాల్లోని ధాన్యం గింజలు, పురుగులు తదితర వాటిని బాతులు ఆహారంగా తీసుకుంటాయి. అలాగే వాటి రెట్ట పొలానికి ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది. రాయవరం – సోమేశ్వరం గ్రామాల మధ్య పొలాలకు మేతకు వెళుతున్న బాతుల గుంపు కనిపించింది. – రాయవరం