
డ్రైన్లో పడి యువకుడి మృతి
కరప: అసంపూర్తిగా వదిలేసిన డ్రెయిన్లో పడిన ఓ యువకుడు అందులోని ఇనుప రాడ్ గుచ్చుకుని మృతి చెందిన ఘటన స్థానికంగా కలవరపరచింది. పోలీసు లు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు కొరిపల్లి గ్రామానికి చెందిన పరిసిపోగులు బాబులు (35) కూలి పని చేస్తుంటాడు. అతనికి ఇద్దరు భార్యలు, ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మంగళవారం కరపకు వచ్చిన బాబులు మద్యం తాగి ఆ మత్తులో తిరిగి కొరిపల్లి వెళ్తూ రోడ్డుపక్కన అసంపూర్తిగా వదిలేసిన సీసీ డ్రైన్లో అదుపు తప్పి పడిపోయా డు. దీంతో డ్రైన్లోని ఇనుప రాడ్ ఒకటి అతని చెవిలోంచి తలలోకి దిగిపోయింది. అక్కడే తాపీ పనిచేస్తున్న వారు మిషన్తో ఆ రాడ్ను కట్ చేసి చికిత్స కోసం 108లో కాకినాడ జీజీహెచ్కు తరలించారు. అక్కడి వైద్యులు బాబులును పరీక్షించి అప్పటికే మృతిచెందినట్టు తెలిపారు. కరప ఎస్ఐ టి.సునీత కేసు దర్యాప్తు చేస్తున్నారు.