ఉప్పలగుప్తం: మండలంలోని ఎస్.యానం బీచ్కు స్నానాలకు వెళ్లి సముద్రంలో మంగళవారం గల్లంతైన ఇద్దరిలో రెండో యువకుడి మృతదేహం బుధవారం లభ్యమైంది. అంబాజీపేట మండలం మాచవరం గ్రామానికి చెందిన యాళ్ల హరికిశోర్ మృత దేహం మంగళవారమే లభ్యమైనప్పటికీ మరో యువకుడు ఇసుకపట్ల జస్వంత్ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టగా బుధవారం ఉదయం వాపాలతిప్ప సమద్రతీర ప్రాంతంలో లభ్యమైనట్టు ఎస్సై సీహెచ్ రాజేష్ తెలిపారు. ఆ మృత దేహాన్ని తహసీల్దార్ వీఎస్ దివాకర్, ఎస్ఐ రాజేష్ పరిశీలించి పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించి కుటుంబ సభ్యులకు అందించారు.
యువకుడి ఆత్మహత్య
యానాం: పిన్ని ఇంటికి వచ్చి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం యానాం పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణం, జయంతి కాలనీకి చెందిన గండ్రాపు వెంకటకృష్ణచైతన్య (24) యానాంలో వికాస్కాలనీలో నివాసం ఉంటున్న తన పిన్ని ఇంటికి ఇటీవల వచ్చాడు. బుధవారం మధ్యాహ్నం ఫ్యాన్కు ఉరివేసుకుని వేలాడుతున్న కృష్ణచైతన్యను చూసిన బంధువులు హుటాహుటిన కిందకు దింపి యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అతను అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కృష్ణచైతన్య బీటెక్ చదువుకున్నాడని ఆత్మహత్యకు ప్రేమ వైఫల్యమే కారణమని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీలో ఉంచినట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై పెంకే గణేష్ తెలిపారు.