మిథ్యారంభం కరిష్యామి! | - | Sakshi
Sakshi News home page

మిథ్యారంభం కరిష్యామి!

Jun 12 2025 3:19 AM | Updated on Jun 12 2025 3:19 AM

మిథ్యారంభం కరిష్యామి!

మిథ్యారంభం కరిష్యామి!

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లావ్యాప్తంగా గురువారం పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. అయితే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందాన తయారైంది నేటి ప్రభుత్వంలో విద్యావ్యవస్థ. గత ప్రభుత్వ హయాంలో పాఠశాలలు తెరవకుండానే, వేసవి సెలవుల్లోనే విద్యార్థులకు అందాల్సిన టెక్ట్స్‌బుక్స్‌, నోట్‌ బుక్స్‌, బ్యాగులు, షూస్‌, యూనిఫాంలు వచ్చేసి స్టాక్‌ పాయింట్లలో ఉండేవి. జిల్లాలోని 19 మండలాల్లో 984 ప్రభుత్వ స్కూల్స్‌ ఉన్నాయి. వీటిలో బాలురు 44,771 మంది, బాలికలు 49,583 మంది ఉన్నారు. టెక్స్స్టబుక్స్‌, నోట్‌బుక్స్‌ వంటివి జిల్లాకు చేరినా అవి ఇంకా మండలాల నుంచి స్కూల్స్‌కు చేరలేదు. బ్యాగులు 94,354 రావాల్సివుండగా 67, 158 మాత్రమే 13 మండలాలకు చేరాయి. 94,354 షూస్‌ రావాల్సి వుండగా 64,726 మంది విద్యార్థులకే వచ్చాయి. యూనిఫాం అయితే కనీసం 10 మండలాలకు కూడా ఇంకా రాలేదు. 94,354 యూనిఫాంలకు 50,549 మాత్రమే వచ్చాయి. ఇంకా 40,805 యూనిఫాంలు రావాల్సి వుంది.

అంసంపూర్తిగా తరగతి గదులు, టాయిలెట్స్‌

నూతన విద్యాసంవత్సరం ప్రారంభంలో ఉత్సాహంతో స్కూల్స్‌కు వెళ్లే విద్యార్థులకు రంగులు వెలసిపోయిన విద్యాలయాలే కనిపించనున్నాయి. పాఠశాలలు తెరిచే నాటికి నాడు – నేడు పనులు పూర్తి చేసి విద్యాలయాలను సిద్ధం చేయాల్సి వుండగా నిర్లక్ష్యంగా సగం పనులతో వాటిని అలాగే వదిలేశారు. దీంతో పాఠశాలల్లో టాయిలెట్స్‌ నిరుపయోగంగా మారాయి. స్కూల్స్‌కు రంగులు వేయలేదు. కొన్ని స్కూల్స్‌లో అదనపు తరగతి గదుల నిర్మాణం ప్రారంభించారు. అవి అసంపూర్తిగానే మిగిలిపోయాయి. కొన్ని పాఠశాలలకు అయితే కిటీకీలు, తలుపులు ఇంకా బిగించలేదు.

పూర్తికాని ఉపాధ్యాయ బదిలీలు

జిల్లాలో జరుగుతున్న ఉపాధ్యాయుల బదిలీలు పూర్తికాలేదు. స్కూల్‌కు వెళ్లి పాఠాలు బోధించాల్సిన ఉపాధ్యాయులకు వారి బదిలీలు ఇంకా అగమ్యగోచరంగా ఉండడంతో ఏం చేయాలో తెలీని పరిస్థితిలో ఉన్నారు. ప్రాథమిక పాఠశాలలో బోధించే ఎస్‌జీటీల కౌన్సెలింగ్‌ పూర్తికాలేదు. దీంతో పాత పాఠశాలల్లోనే ఎస్‌జీటీలు ఉండిపోయారు. అయితే ప్రధానోపాధ్యాయులు మాత్రం నూతనంగా వచ్చారు. వేసవి కాలం సెలవుల్లో పూర్తి చేయాల్సిన బదిలీలు పూర్తి నిర్లక్ష్యంతో పాఠశాలలు తెరిచే వరకూ కూడా పూర్తి చేయలేదు. హామీ ఇచ్చిన ఎస్‌జీటీలకు మాన్యువల్‌ బదిలీలు చేయకుండా ఆన్‌లైన్‌ ప్రక్రియ చేపట్టడంతో వారు ఆందోళన చేశారు. తప్పు తెలుసుకున్న ప్రభుత్వం ఎట్టకేలకు మాన్యువల్‌ బదిలీలకు ఒప్పుకుంది. అయితే ఇప్పటకే ఆలస్యం కావడంతో దీనివల్ల గురువారం కూడా బదిలీల ప్రక్రియ కొనసాగనుంది.

నేడు పాఠశాలల పునఃప్రారంభం

జిల్లాలోని ప్రభుత్వ

పాఠశాలల్లో 94,354 మంది

పూర్తిగారాని విద్యార్థుల స్కూల్‌ కిట్‌లు

పూర్తికాని ఉపాధ్యాయుల బదిలీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement