కూటమి పాలనలో అతివలకు రక్షణ కరవు | - | Sakshi
Sakshi News home page

కూటమి పాలనలో అతివలకు రక్షణ కరవు

Jun 11 2025 8:52 AM | Updated on Jun 11 2025 8:52 AM

కూటమి పాలనలో అతివలకు రక్షణ కరవు

కూటమి పాలనలో అతివలకు రక్షణ కరవు

రాజమహేంద్రవరం సిటీ: కూటమి ప్రభుత్వ పాలనలో సీ్త్రలకు, బాలికలకు రక్షణ కరువైందని పలువురు మహిళలు ధ్వజమెత్తారు. వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి ఆధ్వర్యాన పెద్ద సంఖ్యలో మహిళలు రాజమహేంద్రవరంలో మంగళవారం ఆందోళన నిర్వహించారు. మహిళలపై దాడులు అరికట్టాలని, వైఎస్‌ భారతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. స్థానిక గోకవరం బస్టాండ్‌ వద్ద నిరసన తెలిపి, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ, మహిళలకు రక్షణ అని సీఎం చంద్రబాబు చెప్పడమే తప్ప వారికి రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. మహిళలపై అత్యాచారాలు జరుగుతూంటే సాటి మహిళ అయిన హోం మంత్రి కనీసంగా కూడా స్పందించకపోవడం దారుణమని అన్నారు. అత్యాచారాలకు గురైన మహిళల గురించి ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదన్నారు. మహిళలకు న్యాయం చేస్తామన్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కూడా వారి రక్షణ గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి, మహిళలపై అత్యాచారాలకు ఒడిగడుతున్నవారిని అరెస్ట్‌ చేయాలని, భవిష్యత్తులో మహిళలపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. సాక్షి చానల్‌లో జరిగిన డిబేట్‌లో ఒక తప్పు మాట దొర్లిందని ఆ పత్రిక కార్యాలయాల వద్ద ఆందోళన చేయడం, భారతిని, జగన్‌రె నిందించడం సరైన విధానం కాదని అన్నారు. రాష్ట్రంలో అంబేడ్కర్‌ రాజ్యాంగానికి బదులు రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఏపీ హౌసింగ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్‌పర్సన్‌ మేడపాటి షర్మిలారెడ్డి మాట్లాడుతూ, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అంబేడ్కర్‌ రాజ్యాంగంలో పొందుపరచిన హక్కులను కూటమి ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైనా హామీలు అమలు చేయకపోవడంతో వెన్నుపోటు దినం పేరిట వైఎస్సార్‌ సీపీ ఆందోళన చేయడాన్ని జీర్ణించుకోలేక డైవర్షన్‌ పాలిటిక్స్‌కు తెర లేపారని ధ్వజమెత్తారు. సాక్షి చానల్‌లో జరిగిన డిబేట్‌లో దొర్లిన తప్పునకు సంబంధిత వ్యక్తులు క్షమాపణ చెప్పినప్పటికీ, సంబంధం లేని భారతిని దూషిస్తూ రాద్ధాంతం చేయడంలో ఉద్దేశమేమిటని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన మహిళా అధ్యక్షులు పోలు విజయలక్ష్మ, ఇమంది విజయకుమారి, దాకారపు బంగారమ్మ, ముప్పిడి దమయంతి, అంగాడ సత్యప్రియ, చీరాల ఉమాదేవి, గాండ్ల, తెలుకుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సంకిస భవానీప్రియ తదితరులు పాల్గొన్నారు.

ఫ అత్యాచార ఘటనల్లో

తక్షణ చర్యల్లేవు

ఫ మహిళలకు, బాలికలకు రక్షణ కల్పించాలి

ఫ వైఎస్సార్‌ సీపీ

ఆధ్వర్యాన నిరసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement