సముద్ర స్నానానికి వెళ్లిన యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

సముద్ర స్నానానికి వెళ్లిన యువకుడి మృతి

Jun 11 2025 8:52 AM | Updated on Jun 11 2025 8:52 AM

సముద్

సముద్ర స్నానానికి వెళ్లిన యువకుడి మృతి

ఉప్పలగుప్తం: మండలంలోని ఎస్‌.యానం గ్రామంలో ఉన్న బీచ్‌లో స్నానం చేసేందుకు సముద్రంలోకి దిగి ఇద్దరు యువకులు గల్లంతుకాగా అందులో ఒకరు మృతిచెందారు. మంగళవారం సాయంత్రం అంబాజీపేట మండలం మాచవరానికి చెందిన యాళ్ళ హరికిషోర్‌(19), అయినవిల్లి మండలం నేదునూరుకి చెందిన ఇసుకపట్ల జస్వంత్‌(19), మరో ముగ్గురు నేదునూరుకు చెందిన యువకులు ఎస్‌.యానం బీచ్‌కు వచ్చి స్నానం చేసేందుకు సముద్రంలోకి దిగారు. వీరు ఐదుగురు స్నేహితులు. సముద్రంలో స్నానానికి దిగిన ఐదుగురు యువకుల్లో హరి కిషోర్‌, జస్వంత్‌ సముద్రంలో మునిగిపోయారు. గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టగా హరికిషోర్‌ మృతదేహం లభ్యమయిందని, జస్వంత్‌ కోసం గాలిస్తున్నట్టు ఎస్‌ఐ సీహెచ్‌.రాజేష్‌ తెలిపారు.

కుటుంబాన్ని ఆదుకుంటాడనుకున్నాం...

అంబాజీపేట: మృతిచెందిన యాళ్ల హరికిషోర్‌ ఓ ప్రైవేటు కంపెనీలో రికవరీ ఏజెంటుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతని మృతితో ఆ కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. కుటుంబాన్ని ఆదుకుంటాడనుకున్న నేపథ్యంలో ఇప్పుడు దిక్కెవరని బంధువులు, కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు చూపరులకు కంటతడి పెట్టించింది. వీరి స్వగ్రామం పి.గన్నవరం కాగా మృతుడి తండ్రి కుమార్‌ ఎస్‌.యానం ఓఎన్‌జీసీలో పనిచేస్తున్నారు. తల్లి నాగమణి, అతని సోదరి మాచవరం కుసుమవారిపేటలో అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నారు. అందరితో సరదగా ఉండే హరికిషోర్‌ ఇక లేడని తెలియడంతో కుసుమవారిపేటలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి. హరికిషోర్‌ అందరితో కలిసి ఉండేవాడని అతని మరణం జీర్ణించుకోలేకపోతున్నామని కుటుంబ సభ్యులు, బంధువులు రోదిస్తున్న తీరు చూపరులను కలచివేసింది.

గల్లంతైన మరొకరి కోసం గాలింపు

సముద్ర స్నానానికి వెళ్లిన యువకుడి మృతి1
1/1

సముద్ర స్నానానికి వెళ్లిన యువకుడి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement