
అంతకందకూ తెగుళ్లు
ఫ వాతావరణ మార్పులతో ఇబ్బంది
ఫ దెబ్బతింటున్న తోటలు
ఫ సస్యరక్షణ అవసరమంటున్న అధికారులు
పెరవలి: అంతకందకూ తెగుళ్లు వ్యాపిస్తున్నాయి.. ముప్పేట దాడి చేస్తున్నాయి.. రైతులను గుక్కతిప్పుకోకుండా మార్చుతున్నాయి.. తూర్పుగోదావరి జిల్లాలో 400 హెక్టార్లలో కంద సాగు జరుగుతోంది. ఇందులో పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు, తాళ్లపూడి, కొవ్వూరు, నల్లజర్ల, చాగల్లు, కడియం, రాజమహేంద్రవరం రూరల్ మండలాల్లో ఎక్కువగా సాగవుతోంది. ప్రస్తుతం వాతావరణంలో మార్పులతో తెగుళ్లు దాడి చేస్తున్నాయి. ఒకపక్క వర్షాలు, మరోపక్క ఎండల కారణంగా తోటలపై తెగుళ్లు ఆశిస్తున్నాయని, తగు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని కొవ్వూరు ఉద్యాన శాఖ అధికారి సీహెచ్ శ్రీనివాస్ వివరిస్తున్నారు. ముఖ్యంగా ఇనుప ధాతులోపం, జింక్ ధాతులోపం, ఆకుమచ్చ తెగులు, కాండం లేక మొదలు కుళ్లు తెగులు, మొజాయిక్ తెగులు ఆశించాయని, దీని నివారణకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన తెలిపారు. అవి ఇలా..
ఇనుపధాతు లోపం:
నీటి తడులు సక్రమంగా లేనప్పుడు ఇనుప ధాతులోపం సహజంగా కనిపిస్తుంది. ఆకులు పత్రహరితాన్ని కోల్పోయి తెల్లగా మారతాయి. ఈ ధాతు లోపాన్ని నివారించడానికి లీటరు నీటికి 5 గ్రాముల అన్నభేది, ఒక గ్రాము నిమ్మ ఉప్పు తగిన మోతాదులో కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. అవసరాన్ని బట్టి నీటి తడులు పెడుతూ నీటి ఎద్దడి లేకుండా చూడాలి.
జింకుధాతు లోపం:
ఆకుల ఈనెలు మధ్య పసుపు వర్ణంగా మారి, క్రమేపి ఆకు మొత్తం పండి, ఎండిపోతాయి. ఈ లోపాన్ని నివారించడానికి లీటరు నీటికి మూడు గ్రాముల జింక్ సల్ఫేట్ మోతాదులో కలిపి పది రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి.
ఆకుమచ్చ తెగులు:
వర్షాకాలంలో ఈ తెగులు ఎక్కువగా కనిపిస్తుంది. ఆకులపై చిన్న మచ్చలుగా ప్రారంభమై త్వరగా ఎదిగి, ఆకులు పండి, ఎండిపోయి దిగుబడులు బాగా తగ్గిపోతాయి. దీని నివారణకు తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును పిచికారీ చేయాలి. తెగులు ఎక్కువగా ఉంటే లీటరు నీటికి 2 గ్రాముల మెటలాక్సిల్ ఎమ్.జెడ్ మందును ఒకసారి మాత్రమే ఆకులు అన్ని పూర్తిగా తడిసేలా పిచికారీ చేయాలి. దుంపలు తవ్వకానికి కనీసం రెండు నెలల ముందు నుంచి మందును వాడరాదు.
కాండం లేక మొదలు కుళ్లు
ఈ తెగులు కాండం మొదలు వద్ద ఆశించి కాండం పూర్తిగా కుళ్లి చనిపోతుంది. దీని నివారణకు మురుగు, వర్షపు నీరు నిల్వ లేకుండా జాగ్రత్త పడాలి. తెగులు ఎక్కువగా ఉన్నప్పుడు ఇదే చేలో తిరిగి ఈ పంట వేయరాదు. పంట మార్పిడి తప్పనిసరిగా చేయాలి. తెగులు ఆశించిన చెట్టు చుట్టూ మట్టిని గట్టుగా చేసి, తడి పెట్టినప్పుడు, నీటి ద్వారా ఇతర మొక్కలకు వ్యాపించకుండా అరికట్టాలి. తెగులు ఆశించిన చెట్టు మొదలు చుట్టూ ఉన్న మట్టిని లీటరు నీటికి 2 గ్రాముల కాప్టాన్ లేక 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును కలిపిన ద్రావణంలో బాగా తడిపి తెగులును అరికట్టవచ్చు.
05ఎన్డీడీ48:
ఎల్లో మొజాయిక్ తెగులు సోకి గిడసబారి ఇలా..
మొజాయిక్ తెగులు
తెగులు ఆశించిన మొక్కల ఆకులు పత్ర హరితాన్ని కోల్పోయి, తెలుపు, పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. ఆకులు చిన్నవిగా, ముడుచుకుపోయినట్టు ఉంటాయి. ఈ వైరస్ విత్తనపు దుంపలు, పేను బంక పురుగుల ద్వారా వ్యాపిస్తుంది. దీని నివారణకు విత్తన దుంపలను తెగులు సోకిన తోటల నుంచి సేకరించాలి. పేను బంక నివారణకు డైమిధోయేట్ లేదా మిథైల్ డెమెటాన్లను 2 మిల్లీలీటర్లు ఒక లీటరు నీటికి కలిపి పైరుపై పిచికారీ చేయాలి.

అంతకందకూ తెగుళ్లు

అంతకందకూ తెగుళ్లు

అంతకందకూ తెగుళ్లు