
బాలుడిని బలిగొన్న లారీ
ఘటనలో మేనత్తకు తీవ్ర గాయాలు
ప్రత్తిపాడు: జాతీయ రహదారిపై ప్రత్తిపాడు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందగా, ఉపాధ్యాయురాలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం మేరకు, కోరుకొండలో శారదలీల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. కాకినాడకు చెందిన తన మేనల్లుడు భాష్యం అఖిల్ (11) వేసవి సెలవుల కారణంగా కొద్ది రోజులుగా కోరుకొండలోని తన మేనత్త శారదలీల వద్ద ఉంటున్నాడు. ప్రత్తిపాడులోని బంధువుల ఇంటికి వారిద్దరూ స్కూటీపై బయలుదేరారు. ఎన్హెచ్పై పోలవరం కాలువ సమీపంలో వారి స్కూటీని లారీ ఢీకొంది. ఈ ఘటనలో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108లో ప్రత్తిపాడు సీహెచ్సీకి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం కాకినాడ తరలిస్తుండగా అఖిల్ మార్గం మధ్యలో మృతి చెందాడు. శారదలీలను కాకినాడలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రత్తిపాడు ఎస్సై ఎస్ లక్ష్మీకాంతం కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బైక్ను ఢీకొన్న మినీవ్యాన్
ముమ్మిడివరం: మోటార్ బైక్పై ప్రయాణిస్తున్న తండ్రీకొడుకులను వెనుక నుంచి మినీ వ్యాన్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన సంఘటన ఇది. ముమ్మిడివరం నగర పంచాయతీ టీటీఆర్ నగర్కు చెందిన ఏడిద సోమరాజు, అతని కుమారుడు సుదర్శన్ మోటార్ బైక్పై బుధవారం అమలాపురం వైపు వెళుతున్నారు. మహిపాల చెరువు సెంటర్లో వెనుక నుంచి వచ్చిన మినీవ్యాన్ వీరి బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో తండ్రీకొడుకులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు 108 వాహనంలో అమలాపురంలోని ప్రవేటు ఆసుపత్రికి తరలించారు.

బాలుడిని బలిగొన్న లారీ