
కక్ష సాధింపు చర్యలు దారుణం
‘సాక్షి’ ఎడిటర్పై పోలీసులు కేసు నమోదు చేయడం, ఆ పత్రికా ప్రధాన కార్యాలయానికి వచ్చి కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం దారుణం. పోలీసు అధికారులకు న్యాయబద్ధంగా దక్కాల్సిన పదోన్నతులు కల్పించలేదనే విషయాన్ని సాక్షి పత్రిక వెలుగులోకి తెచ్చింది. దీంతో పోలీసులు ఆ కార్యాలయంలో అర్ధరాత్రి హడావుడి చేయడం తగదు. తగిన ఆధారాలు, వాస్తవాలు ఉంటే కేసులు నమోదు చేసుకున్నా పర్వాలేదు. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిపై వరసగా కేసులు నమోదు చేసి వేధించడమంటే పత్రికా స్వేచ్ఛపై దాడి జరిగినట్టే. – ఎమ్మెన్వీ ప్రసాద్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, అమలాపురం
●