క్వాంటం టెక్నాలజీ ఎఫ్‌డీపీ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

క్వాంటం టెక్నాలజీ ఎఫ్‌డీపీ ప్రారంభం

Jul 15 2025 7:01 AM | Updated on Jul 15 2025 7:01 AM

క్వాంటం టెక్నాలజీ  ఎఫ్‌డీపీ ప్రారంభం

క్వాంటం టెక్నాలజీ ఎఫ్‌డీపీ ప్రారంభం

రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ క్యాంపస్‌లోని కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ ఆధ్వర్యంలో క్వాంటం టెక్నాలజీపై ఏఐసీటీఈ – ఏటీఏఎల్‌ స్పాన్సర్డ్‌ ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (ఎఫ్‌డీపీ) సోమవారం ప్రారంభమైంది. క్వాంటం టెక్నాలజీల రంగాన్ని అన్వేషించడమే లక్ష్యంగా ఇండియన్‌ ఇన్సిట్యూట్స్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్‌ ఇన్సిట్యూట్స్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) ల ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం హర్షణీయమని వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ అన్నారు. సమకాలీన విద్య, పారిశ్రామిక దృశ్యంలో క్వాంటం టెక్నాలజీల ఔచిత్యాన్ని వివరించారు. ఎఫ్‌డీపీ కన్వీనర్‌ డాక్టర్‌ వి. పెర్సిస్‌ మాట్లాడుతూ 50 మంది వరకు ఫ్యాకల్డీ సభ్యులు హాజరైన ఈ కార్యక్రమం ఈ నెల 19 వరకు జరుగుతుందన్నారు. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.వెంకటేశ్వర్రావు, కో కన్వీనర్‌ డాక్టర్‌ జి. కీర్తి మరిట, సీఎస్‌ఈ హెచ్‌ఓడి డాక్టర్‌ బి.కెజియయారాణి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement