మస్కట్‌లో ఏం జరిగింది..? మహిళ సెల్ఫీ వీడియో కలకలం..

Woman Cheated By An Agent Rathnamma In Chittoor District - Sakshi

ఎర్రావారిపాళెం(చిత్తూరు జిల్లా): ‘నేను ఏజెంట్‌ చేతిలో మోసపోయా. ఆరోగ్యం కూడా క్షీణించింది. నన్ను భారత్‌కు రప్పించేలా చర్యలు చేపట్టండి’ అంటూ ఎర్రావారి పాళెం మండలం బోడ వాండ్లపల్లెకి చెందిన సులోచన(38) కుటుంబ సభ్యులకు మంగళవారం మస్కట్‌ నుంచి సెల్ఫీ వీడియో పంపింది.

తనను అనుకున్నచోట పనిలో పెట్టలేదని వాపోయింది. స్వదేశానికి తీసుకెళ్లాలని ఏజెంట్‌ను బతిమలాడినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఎలాగైనా తనను భారత్‌కు పిలిపించుకోవాలని కుటుంబ సభ్యులను వేడుకుంది.
చదవండి: పైసా లేదు.. రూ.30 లక్షలు ఉన్నాయని గొప్పలు.. చివరికి బిగ్‌ ట్విస్ట్‌  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top