Love Couple Attempted For Suicide In Vizianagaram, Details Inside - Sakshi
Sakshi News home page

Vizianagaram: పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదని ప్రేమజంట ఆత్మహత్యాయత్నం..

Aug 18 2022 1:45 PM | Updated on Aug 18 2022 2:09 PM

Love Couple Suicide Attempt In Vizianagaram - Sakshi

చికిత్స పొందుతున్న ఎం.శ్రీను, స్రవంతి

విజయనగరం/సీతానగరం: తమ ప్రేమను పెద్దలు నిరాకరించడంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.  సీతానగరం మండలం బగ్గందొరవలస గ్రామంలో బుధవారం జరిగిన ఈ సంఘటనపై పార్వతీపురం జిల్లా ఆస్పత్రి ఔట్‌పోస్టు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఎల్‌.స్రవంతి ఇంటరీ్మడియట్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే  గ్రామానికి చెందిన ఎం.శ్రీను కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. 

వారిద్దరూ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. స్రవంతి తల్లిదండ్రులు ఆమెకు వేరే  పెళ్లి   నిశ్చయించారు. ఈ విషయం ప్రేమికుడికి స్రవంతి చెప్పి గ్రామంలోని సచివాలయం వద్దకు రమ్మంది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేక   చనిపోదామని నిర్ణయం తీసుకుని పురుగు మందుతాగి ఆత్మహత్యాయత్నం చేశారు. విషయం గమనించిన శ్రీను సోదరుడు గణపతి ఆటోలో ఇద్దరిని పార్వతీపురం జిల్లా  ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించారు. ఈ ఘటనపై ఔట్‌పోస్టుపోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement