కిక్కిరిసిన బోయకొండ
చౌడేపల్లె : కోరిన కోర్కెలు తీర్చే ఆరాధ్యదైవంగా పేరుగాంచిన శ్రీ బోయకొండ గంగమ్మ తల్లి దీవెనలకోసం భక్తులు బోయకొండకు ఆదివారం అధిక సంఖ్యలో తరలివచ్చారు. బోయకొండలో ఎటు చూసినా జన సంద్రంగా మారింది. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేల మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం వివిధ వాహనాల్లో తరలివచ్చారు. ఒక్క రోజే సుమారు 15 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొన్నారని అధికారులు వెల్లడించారు. కోర్కెలు తీరిన భక్తులు ిపిండి ,నూనెదీపాలు, దీవెలతో అమ్మ వారికి మొక్కులు చెల్లించారు. ఆలయ ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు.
కిక్కిరిసిన బోయకొండ


