 
															పురుషోత్తమునికి పుష్పాంజలి
శ్రీవారికి పుష్పయాగం నిర్వహిస్తున్న వేదపండితులు
తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి వేడుకగా పుష్పార్చన నిర్వహించారు. సువాసనలు వెదజల్లే 16 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో రంగురంగుల పుష్పాలు, పత్రాల మధ్య స్వామి, అమ్మవార్ల వైభవం మరింత ఇనుమడించింది. అంతకు ముందు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఏవైనా తెలియక దోషాలు జరిగి ఉంటే ఆ దోష నివారణకు బ్రహ్మోత్సవాల తర్వాత వచ్చే కార్తీక మాసంలో శ్రీవారి జన్మనక్షత్రమైన శ్రవణా నక్షత్రం రోజున పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీ. – తిరుమల
 
							పురుషోత్తమునికి పుష్పాంజలి
 
							పురుషోత్తమునికి పుష్పాంజలి

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
