చేపల వలలో భారీ కొండచిలువ | - | Sakshi
Sakshi News home page

చేపల వలలో భారీ కొండచిలువ

Oct 31 2025 7:53 AM | Updated on Oct 31 2025 7:53 AM

చేపల వలలో  భారీ కొండచిలువ

చేపల వలలో భారీ కొండచిలువ

పూతలపట్టు(యాదమరి): చేపల కోసం వేసిన వలకు ఓ భారీ కొండ చిలువ చిక్కిన ఘటన మండలంలోని నీవా నదిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువులు, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సోమ వారం నీవానదిలో కొందరు చేపల వేట కోసం వల వేశారు. అనూహ్యంగా అందులో చేపలకు బదు లు భారీ కొండచిలువ పడింది. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచార అందించడంతో వారు ఘటనా స్థలికి చేరుకుని వలలో చిక్కుకున్న కొండచిలువను బయటకు తీసి సురక్షితంగా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement