సామూహిక అక్షరాభ్యాసం | - | Sakshi
Sakshi News home page

సామూహిక అక్షరాభ్యాసం

Jun 9 2025 6:57 AM | Updated on Jun 9 2025 6:57 AM

సామూహ

సామూహిక అక్షరాభ్యాసం

విత్తన నాణ్యతతో దిగుబడులు
సాగులో నాణ్యమైన విత్తనాలు వినియోగించడం ద్వారా మంచి దిగుబడులు సాధించ వచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.
నేడు బోయకొండలో యోగాంధ్ర
● ఉదయం 7గంటలకే ప్రారంభం ● ఇన్‌చార్జి మంత్రి మండిపల్లి రాక ● ఏర్పాట్ల నిర్వహణపై కలెక్టర్‌ ఆరా

కాణిపాకం కిటకిట

కాణిపాకంలోని వరసిద్ధి వినాయకస్వామి ఆలయం ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు పోటెత్తారు.

సోమవారం శ్రీ 9 శ్రీ జూన్‌ శ్రీ 2025

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలో 116 డిగ్రీ కళాశాలలు, ఇంజినీరింగ్‌ కళాశాలలు 14, ఐటీఐ, నర్సింగ్‌, పాలిటెక్నిక్‌, మెడకల్‌, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలు 53 ఉన్నాయి. ఈ కళాశాలల్లో 64,789 మంది విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు. ఇప్పటికే డిగ్రీ, ఇంజినీరింగ్‌ పూర్తి చేసి డీఎస్సీ, గ్రూపు పరీక్షలు, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌, ఏపీపీఎస్సీ తదితర కొలువుల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు 32 వేలకు పైగా ఉన్నారు. తమ బిడ్డల భవిష్యత్తు కోసం అయినకాడికి అప్పులు చేసి కోచింగ్‌ సెంటర్లలో శిక్షణ ఇప్పిస్తున్న తల్లిదండ్రులు ఎందరో.. ఉన్నత చదువులు చదివి కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అరకొర జీతంపై స్థానికంగా, ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి వ్యాపార, ప్రైవేట్‌ సంస్థల్లో పనిచేస్తున్న వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. వీరిలో ఎంతో మంది తమ చదువుకు తగ్గ ఉద్యోగం కోసం ఎదురుచూపులు చూస్తున్నారు.

ఇంటికొక ఉద్యోగమని నమ్మించి మోసం

కూటమి ప్రభుత్వం యువశక్తికి వెన్నుపోటు పొడిచింది. దేశాభ్యున్నతికి అండగా నిలిచే యువతను నిర్వీర్యం చేస్తోంది. అధికారంలోకి రాగానే ఇంటికొక ఉద్యోగం ఇస్తామంటూ ఊదరగొట్టిన చంద్రబాబు, పవన్‌న్‌కళ్యాణ్‌, లోకేష్‌ తమ హామీల అమలును గాలికొదిలేశారు. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తాం...20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం...ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేల భృతి ఇస్తాం అంటూ ఎన్నికల ప్రచారం చేసిన నేతలు ఇప్పుడు ఏ మాత్రం నోరు మెదపడం లేదు. ప్రజల గడప వద్దకే ప్రభుత్వ పాలనను చేరువ చేసేందుకు వైఎస్సార్‌సీపీ సర్కారు తీసుకొచ్చిన వలంటీర్‌ వ్యవస్థను రద్దు చేశారు. రాజకీయ కక్ష్లతో డ్వామా, డీఆర్‌డీఏ, విద్యాశాఖ, జిల్లా పరిషత్‌ పలు శాఖల్లో పనిచేస్తున్న చిరుద్యోగులను వేల మందిని జిల్లాలో తొలగించారు.

పట్టాలు చేతబట్టుకొని..

జిల్లా వ్యాప్తంగా ఏటా ఇంజినీరింగ్‌ చదువులు పూర్తి చేసి 32 వేల మంది వరకు యువత పట్టాలతో బయటకు వస్తున్నారు. డిగ్రీ, పీజీలు చేసిన మరో 35 వేల మంది వరకు చదువులు పూర్తి చేసుకుని పట్టాలు చేతబట్టి ఉపాధి కోసం వెతుకుతున్నారు. వీరుకాకుండా చదువులు మధ్యలో ఆపేసిన మరో 15 వేల మంది తమ అర్హతలను బట్టి ఉద్యోగాల కోసం రోడ్లపై తిరుగుతున్నారు. పాలిటెక్నిక్‌, ఐటీఐ, బీఈడీ, డీఈడీ వంటి ఇతర కోర్సులను పూర్తి చేసిన యువత తమ అర్హత పత్రాలతో ఉద్యోగాల వేటలో ఉన్నారు.

ప్రైవేట్‌ ఉద్యోగాల పరిస్థితి అంతంతే..

కూటమి అధికారంలోకి వచ్చాక వ్యాపారాలు దిగజారాయి. ఏ నెలకానెల జీఎస్టీ ఆదాయం దిగజారుతుండటం వ్యాపారాల దుస్థితికి అద్దం పడుతోంది. అటు ఉద్యోగాలు లేక, పరిశ్రమల స్థాపనకు అవకాశం లేక, అల్లాడుతున్న యువత ఏదైనా ప్రైవేట్‌ సంస్థలో జాబ్‌ చేసుకుని కుటుంబానికి అండగా ఉందామని భావిస్తే దానికి సైతం ఈ ప్రభుత్వ విధానాలు గండికొడుతున్నాయి. చిత్తూరు జిల్లాలో గత ఏడాది 32 శాతానికి పైగా వ్యాపారాలు పడిపోయాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. కనీసం 35 శాతం పెరుగుదల ఉండే రంగాల్లోనూ అంతమేర తగ్గుదల ఉండటంతో యువతకు ఎటువంటి అవకాశాలు లేకుండా పోతున్నాయి.

గత ఐదేళ్లల్లో ఉద్యోగాల జాతర

వైఎస్సార్‌సీపీ పాలనలో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సీఎంగా పనిచేసిన ఐదేళ్ల కాలంలో యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు లభించాయి. గడిచిన ప్రభుత్వం దాదాపుగా 4.56 లక్షల ఉద్యోగాలు జిల్లాలో భర్తీ చేసింది. అందులో 2 లక్షల ఉద్యోగాలు శాశ్వత ఉద్యోగాలు కావడం గమనార్హం. ఆప్కాస్‌ ద్వారా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సైతం భద్రత కల్పించింది. యువతకు నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా లక్ష వరకు ప్రైవేట్‌ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించారు.

నేడు పోలీసు గ్రీవెన్స్‌

చిత్తూరు అర్బన్‌ : చిత్తూరు నగరంలోని వన్‌టౌన్‌ పక్కనున్న రిజర్వు (ఏఆర్‌)కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మణికంఠ చందోలు ఒక ప్రకనటలో తెలిపారు. ప్రజలకు సమస్యలు ఏవైనా ఉంటే తనను నేరుగా కలిసి మాట్లాడొచ్చనన్నారు. ఉదయం 10.30 గంటల నుంచి ఇక్కడ ఇచ్చే వినతులు, ఫిర్యాదులను పరిశీలించి చర్యలు చేపడుతామని ఎస్పీ తెలిపారు.

నేడు అర్ధగిరి క్షేత్రంలో

హుండీ లెక్కింపు

తవణంపల్లె : ప్రముఖ పుణ్యక్షేత్రమైన అర్ధగిరి శ్రీ వీరాంజనేయస్వామి దేవస్థానంలో సోమవారం ఉదయం 9 గంటలకు హుండీ లెక్కిస్తామని ఆలయ ఇన్‌చార్జి కార్యనిర్వహణాధికారి హనుమంతురావు తెలిపారు. ఎండోమెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ పర్యవేక్షణలో ఆలయ సిబ్బంది, భక్తుల సమక్షంలో హుండీ కానుకలు లెక్కిస్తామని వివరించారు.

గురుకులాల్లో ఎంపిక ప్రక్రియ

చిత్తూరు కార్పొరేషన్‌ : ఉమ్మడి జిల్లాలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులాల్లో ప్రవేశాలకు విద్యార్థులు తమ సీటు ఖరారు చేసుకోవాలని డీసీఓ గీత తెలిపారు. ఇటీవల నిర్వహించిన 5వ తరగతి, ఇంటర్‌ ప్రథమ సంవత్సర ప్రవేశాలకు జరిగిన పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు పొందిన వారికి ఎంపిక ప్రక్రియ జరుగుతోందన్నారు. ఎంపికై న విద్యార్థుల మొబైల్‌కు మెసేజ్‌ వచ్చిన వెంటనే ఆయా పాఠశాలలు, కళాశాలకు వెళ్లి తమ సీటును ఖరారు చేసుకోవాలని డీసీఓ కోరారు. మొదటి జాబితాలో అర్హత పొందినవారు వెంటనే ప్రవేశం పొందాలని, లేనిపక్షంలో వారికి ప్రవేశం ఉండదన్నారు. ఈ నేపథ్యంలో రెండో జాబితాను వెంటనే విడుదల చేస్తామన్నారు.

స్మార్ట్‌ మీటర్ల విధానం వద్దు

చిత్తూరు కార్పొరేషన్‌ : అధికారంలో లేనప్పుడు స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటుపై కూటమి నేతలు గగ్గోలు పెట్టిన కూటమి నేడు స్మార్టు మీటర్ల బిగింపు వేగవంతం చేయాలని అనడం విడ్డూరంగా ఉందని విద్యుత్‌ వినియోగదారుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి చైతన్య పేర్కొన్నారు. ఆ సంఘం కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. స్మార్టు మీటర్ల విధానం లోపభూయిష్టంగా ఉందని, దీనిని రద్దు చేయాలని ఆయన డిమాండు చేశారు. ఆదానీ సంస్థకు కోట్లు విలువ చేసే ఈ ప్రాజెక్టును కేంద్రం ఇచ్చిందన్నారు. వారికి ఎదురు చెప్పలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. వాణిజ్య, పరిశ్రమల బిగింపు అయ్యాక నివాసాలకు మీటర్లను బిగించనున్నారని, వెంటనే ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో నాయకులు సౌకత్‌, భాస్కర్‌, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ

తిరుపతి సిటీ : ఎస్వీయూ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పీజీసెట్‌–2025 పరీక్ష ఉమ్మడి జిల్లాలోని వేము ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కళాశాలలో సోమవారం జరగనున్నట్లు కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పీసీ వెంకటేశ్వర్లు తెలిపారు. మూడు సెషన్లలో జరగనున్న ఈ పరీక్షకు తొలి రోజు 366 మంది హాజరవుతారని చెప్పారు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి కంటే అర్ధగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. పీజీ సెట్‌ పరీక్షలు ఈనెల 12వ తేదీ వరకు జరగనున్నట్టు తెలిపారు.

శ్రీవారి దర్శనానికి

24 గంటలు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లు నిండాయి. క్యూలైన్‌ శిలాతోరణం వద్దకు చేరింది. శనివారం అర్ధరాత్రి వరకు 88,257 మంది స్వామివారిని దర్శించుకోగా 45,068 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.68 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.

చౌడేపల్లె : మండలంలోని బోయకొండ వద్ద సోమవారం ఉదయం 7 గంటలకే యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తెలిపారు. ఆదివారం యోగాంధ్ర కార్యక్రమ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. యోగా డే కార్యక్రమానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రవాణాశాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి హాజరవుతారన్నారు. అన్నిశాఖల సమన్వయంతో నిర్ణీత సమయానికి బోయకొండ గోశాల వద్దకు చేరుకోవాలన్నారు. ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు యోగాసనాలు నిర్వహిస్తారన్నారు. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో సుమారు 2 వేల మందితో భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ మేరకు రవాణా, మౌలిక సదుపాయాల కల్పనలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

కాణిపాకం : కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో ఆదివారం సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. తొలుత స్వామికి అభిషేకాలు నిర్వహించారు. ఆస్థాన మండపంలో శ్రీసరస్వతిదేవిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. అనంతరం చిన్నపిల్లల చేత ఈవో పెంచల కిషోర్‌ అక్షరాలు దిద్దించారు. అక్షరాభ్యాసం శాస్త్రోక్తంగా జరిపించారు. కార్యక్రమానికి 200 మంది పిల్లలు, తల్లిదండ్రులు హాజరయ్యారు. కార్యక్రమంలో ఏఈవో రవీంద్రబాబు,సిబ్బంది కోదండపాణి, హరి, మాధవరెడ్డి, వాసు పాల్గొన్నారు.

– 8లో

– 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

బాబూ జాబు ఎక్కడ అంటున్న నిరుద్యోగులు

20 లక్షల ఉద్యోగాలిస్తామంటూ

ఊరించిన కూటమి

ఏడాదవుతున్నా ఒక్క ఉద్యోగమూ ఇవ్వని ప్రభుత్వం

ఊసేలేని జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటన

అడ్డగోలుగా వేల మంది ఉద్యోగాలతొలగింపు

జిల్లాలో ఏటా 32 వేల ఇంజినీరింగ్‌ పట్టభద్రులు

కూటమి టీడీపీ ఎన్నికల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మించింది. ఉద్యోగాలు వచ్చే వరకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రగల్భాలు పలికింది. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని ఆర్బాటం చేసింది. తీరా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఉద్యోగాల ఊసే మరిచిపోయింది..భృతి కలగా మారిపోయింది. ఇక జాబ్‌ క్యాలెండర్‌పై చేతులెత్తేసింది. ఇలా యువతను కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా నిలువునా ముంచేసింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 4.56 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి ఉపాధి అవకాశాలు కల్పించింది. కానీ నేడు కూటమి ప్రభుత్వం యువతకు వెన్నుపోటు పొడిచింది.

జిల్లాలోని కళాశాలల సమాచారం

డిగ్రీ కళాశాలలు 116

ఇంజినీరింగ్‌ కళాశాలలు 14

ఐటీఐ కళాశాలలు 18

నర్సింగ్‌ కళాశాలలు 07

పాలిటెక్నిక్‌ కళాశాలలు 08

మెడికల్‌ 02

బీఈడీ కళాశాలలు 07

ఎంబీఏ, ఎంసీఏ 11

మొత్తం కళాశాలలు 183

జాబ్‌ క్యాలెండర్‌ ..నాటకం

ప్రస్తుత మంత్రి నారా లోకేష్‌ యువతకు జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామంటూ గతంలో పదే పదే ఉదరగొట్టారు. యువతతో ఎక్కడ సమావేశాలు నిర్వహించినా జాబ్‌ క్యాలెండర్‌ మాటే ప్రస్తావించారు. ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీ సర్కార్‌ పై లేనిపోని అవాస్తవాలను ప్రచారం చేసి యువతను ఏ మార్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్‌ క్యాలెండర్‌ లేకుండా చేతులెత్తేశారు. దీనికి తోడు తమకు నష్టం కలిగించే నిర్ణయాలనే అమలు చేస్తున్నారంటూ జిల్లాలోని యువత ఆవేదన వ్యక్తం చేస్తోంది.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఎగనామం

జిల్లా వ్యాప్తంగా ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులకు పది నెలలుగా ఎదురుచూపులే మిగిలాయి. విద్యాదీవెన, వసతి దీవెన నిధుల కోసం విద్యార్థులు నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. ఇంజినీరింగ్‌, డిగ్రీ, డిప్లొమో తదితర కోర్సులకు సంబంధించి ఏడాది ఫీజును రీయింబర్స్‌మెంట్‌లో నాలుగు విడతలుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని కూటమి హామీ ఇచ్చింది. అయితే 2024–25 విద్యాసంవత్సరం పూర్తయినా...ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు చిల్లిగవ్వ చేతికందలేదు. దీంతో ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. కూటమి నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళాశాలలు ఫీజులు చెల్లించాలని ఒత్తిళ్లు చేస్తుండటంతో తల్లిదండ్రులు అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొంది.

భృతి.. బూటకం

టీడీపీ నేతలు ఎన్నికల సమయంలో ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేలు భృతిని ఇస్తామని ఆర్భాటంగా ప్రచారం చేశారు. ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇస్తామని విస్తృతంగా ప్రచారం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అవుతున్నా ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి మాటే జిల్లాలో వినిపించడం లేదు. చిత్తూరు జిల్లాలో లక్షల మంది నిరుద్యోగ భృతి కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నమ్మి కూటమి నేతలకు ఓట్లు వేసి గెలిపించామని, ఇప్పుడు భృతి ఊసే ఎత్తకపోవడం దుర్మార్గం.

జాబ్‌ క్యాలెండర్‌ ఆర్భాటమేనా..

జనవరిలోనే జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తానని నారా లోకేష్‌ యువ గళం పాదయాత్రలో ఆర్భాటంగా ప్రకటించారు. ఎన్నికల్లో హామీలు ఇచ్చారు. అయితే ఇప్పటి వరకూ జాబ్‌ క్యాలెండర్‌ ఊసే ఎత్తడం లేదు. నిరుద్యోగ భృతి మరిచిపోయారు. నిరుద్యోగులను కూటమి ప్రభు త్వం మోసం చేసింది. ఎంఎస్సీ వరకు చదువుకున్నాను. ఉద్యోగం రాకపోవడంతో సొంత గ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్నా. నిరుద్యోగులు కూట మి ప్రభుత్వాన్ని నమ్మి మరోసారి మోసపోయారు.

– రమేష్‌, వి.కోట మండలం, చిత్తూరు జిల్లా

మోసపూరిత వాగ్దానాలు

చంద్రబాబు 2014 ఎన్నికల్లో నూ నిరుద్యోగ భృతి అంటూ మోసం చేశారు. మళ్లీ మొన్న ఎన్నికల్లోనూ ఈ హామీ ఇచ్చా రు. సూపర్‌సిక్స్‌ హామీలతో అధికారం చేపట్టి తొమ్మిది నెలలు గడిచినా ఇప్పటి వరకూ నిరుద్యోగ భృతి ప్రస్తావన లేదు. ఇలా మోసపూరిత వాగ్దానాలతో యువతను మోసం చేయడం సమంజసం కాదు.

– సద్ధాం, విద్యార్థి సంఘ నాయకుడు,చిత్తూరు నగరం

నోటిఫికేషన్లు లేవు.. భృతి లేదు..

ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలు స్థాపించి 5 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొస్తామన్నారు. ఇంటికి ఒక పారిశ్రామిక వేత్తను తయారు చేస్తామన్నారు. ఇప్పుడేమో సర్వేల పేరుతో కాలయాపన చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి పది నెలలవుతోంది ఏ వర్గానికి ఎలాంటి మేలు చేయలేదు. బీఎస్సీ కంప్యూటర్స్‌ చదువుకున్నాను. ఎలాంటి నోటిఫికేషన్లు లేకపోగా, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు.

– కిషోర్‌, నిరుద్యోగి, నగరి మండలం

కుటుంబంపై మరింత భారం

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాకపోవడంతో తల్లిదండ్రులపై మరింత భారం పడుతోంది. గత ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సకాలంలో వచ్చేది. గత ఐదేళ్లు ఎలాంటి సమస్యలు లేవు. ప్రస్తుతం ఫీజు మొత్తం ఒక్కసారి కట్టలేక విద్యార్థులంతా ఆందోళనకు లోనవుతున్నారు. ఫీజుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరం.

– ముస్తా, విద్యార్థి, కార్వేటినగరం

నాలుగు లక్షల మంది యువతకు మొండిచేయి

జిల్లాలోని యువత చంద్రబాబు అండ్‌ కో చేతిలో మరోసారి మోసపోయారు. ఏడాదికి నాలుగు లక్షలు కాదు కదా కొత్తగా నాలుగు పదుల సంఖ్యలోనైనా ఉద్యోగాల భర్తీని కూటమి ప్రభుత్వం చేపట్టలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కల్పించిన ఉద్యోగాలను సైతం ఊడగొడుతున్నారు. సచివాలయ ఉద్యోగులను అనిశ్చితి పరిస్థితుల్లోకి నెట్టేశారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు బాట పట్టిస్తున్నారు. రూ.5 వేలు కాదు కదా రూ.10 వేలు ఇస్తామని వలంటీర్లలో ఆశలు కల్పించి తీరా అధికారంలోకి వచ్చాక వారి ఉద్యోగాలు తొలగించి కడుపులు కొట్టారు. ఇక నిరుద్యోగ భృతి హామీ టీడీపీ 2014–19 పాలనలో మాదిరిగానే ప్రస్తుతం ఎగనామం పెట్టేశారు. చిత్తూరు జిల్లాలో దాదాపు 4 లక్షల మంది నిరుద్యోగ యువతకు మొండి చేయి చూపించారు.

సామూహిక అక్షరాభ్యాసం1
1/10

సామూహిక అక్షరాభ్యాసం

సామూహిక అక్షరాభ్యాసం2
2/10

సామూహిక అక్షరాభ్యాసం

సామూహిక అక్షరాభ్యాసం3
3/10

సామూహిక అక్షరాభ్యాసం

సామూహిక అక్షరాభ్యాసం4
4/10

సామూహిక అక్షరాభ్యాసం

సామూహిక అక్షరాభ్యాసం5
5/10

సామూహిక అక్షరాభ్యాసం

సామూహిక అక్షరాభ్యాసం6
6/10

సామూహిక అక్షరాభ్యాసం

సామూహిక అక్షరాభ్యాసం7
7/10

సామూహిక అక్షరాభ్యాసం

సామూహిక అక్షరాభ్యాసం8
8/10

సామూహిక అక్షరాభ్యాసం

సామూహిక అక్షరాభ్యాసం9
9/10

సామూహిక అక్షరాభ్యాసం

సామూహిక అక్షరాభ్యాసం10
10/10

సామూహిక అక్షరాభ్యాసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement