
విత్తన నాణ్యతతో దిగుబడులు
పెనుమూరు(కార్వేటినగరం) : సాగులో నాణ్యమైన విత్తనం వినియోగించడం ద్వారా మంచి దిగుబడిని సాధించవచ్చని రాస్ కృషి వి/్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత డాక్టర్ శ్రీనివాసులు తెలిపారు. రాస్ కృషి వి/్ఞాన కేంద్రం తిరుపతి, వికసిత్ కృషి సంకల్ప అభియాన్లో భాగంగా ఆదివారం పెనుమూరు మండలంలోని గొబ్బిళ్లమిట్ట, వడ్లవానిమిట్ట, గాంధీపురం గ్రామాల్లో వ్యవసాయ శాస్త్రవేతలు , వ్యవసాయశాఖ అధికారులు రైతులతో చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఖరీఫ్ సీజన్లో పండించే పంటలకు నూతన రకాలు చేపట్టాల్సిన మేలైన యాజమాన్య పద్ధతులు, ప్రకృతి వ్యవసాయ పద్ధతులు మొదలైన వాటిపై రైతులకు అవగాహన కల్పించారు. అదే విధంగా పాడిపశువుల పోషణ, సమగ్ర వ్యవసాయ విధానం, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వ్యవసాయ శాఖ నుంచి అందిస్తున్న వివిధ సేవలు, మొబైల్ యాప్ల ప్రాముఖ్యం, వినియోగం మొదలైన అంశాలను వివరించారు. అనంతరం గ్రామాల్లో రైతులు సాగు చేసిన పూల మొక్కల నర్సరీలో కృత్రిమ లైటింగ్, ప్లాస్టిక్ మల్చింగ్ వంటి సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి శాస్త్రవేత డాక్టర్ ఎం.మంజునాథ్, పెనుమూరు మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసులు, కేవీకే విస్తరణ శాస్త్రవేత శ్రీరామ్కుమార్, రైతు సేవా కేంద్రం సిబ్బంది , అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.