పేదల కల సాకారం చేసిన నాయకుడు | - | Sakshi
Sakshi News home page

పేదల కల సాకారం చేసిన నాయకుడు

Jun 3 2025 10:31 AM | Updated on Jun 3 2025 2:15 PM

పేదల కల సాకారం చేసిన నాయకుడు

పేదల కల సాకారం చేసిన నాయకుడు

చిత్తూరు కలెక్టరేట్‌ : దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న పేదలకు గత వైఎస్సార్‌సీపీ సర్కారులో ఇళ్ల పట్టాలతో పాటు పక్కా గృహాలను మంజూరు చేశారు. గత ప్రభుత్వ పాలన చక్కటి ప్రణాళికతో లబ్ధిదారులు ఇళ్లను నిర్మించుకున్నారు. జిల్లాలోని ప్రతి మండలంలో వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో అవసరమైన రోడ్లు, కాలువలు, నీరు, విద్యుత్‌, ఇతర మౌళిక సదుపాయాలను కల్పించారు. ఈ పథకానికి గత వైఎస్సార్‌సీపీ సర్కారు కోట్ల నిధులను ఖర్చు చేసింది. లబ్ధిదారులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, సమీక్షిస్తూ గత ఐదేళ్ల పాటు పక్కాగృహాల పథకాన్ని పకడ్బందీగా అమలు చేశారు. అర్హులైన పేదలందరికీ కులం, మతం, వర్గం, పార్టీలు అనే తేడా లేకుండా బృహత్తర లక్ష్య సాధనతో పేదలందరికీ ఇళ్ల స్థలాలు, పక్కా గృహాలను మంజూరు చేశారు. జిల్లా వ్యాప్తంగా 2019వ సంవత్సరానికి ముందు పేద ప్రజలు అద్దె గృహాల్లో ఉంటూ నెలవారీ వేల కొద్దీ అద్దెలు చెల్లించేవారు. కూలీ పనులు, చిరువ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగించే పేద ప్రజలు సంపాదించే అతి కొద్ది సంపాదనలో సగానికిపైగా నగదు అద్దె కోసమే చెల్లించేవారు. అలాంటి పరిస్థితుల నుంచి గత ఐదేళ్ల పాటు వైఎస్సార్‌సీపీ సర్కారు అమలు చేసిన ఉచిత ఇళ్ల పట్టాలు, పక్కాగృహాలతో జిల్లాలోని పేద ప్రజలు లబ్ధిపొందారు. ఈ పథకంలో లబ్ధిపొందిన పేదలు పక్కా ఇళ్ల గృహాలు నిర్మించుకుని ఇంటిల్లిపాది సుఖసంతోషాలతో జీవిస్తున్నారు. గత సీఎం వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేసిన మేలు వల్లే సొంత గృహాలను నిర్మించుకున్నామని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో గత ఐదేళ్లలో మంజూరు చేసిన పక్కా గృహాల వివరాలు

నియోజక మంజూరైన ఖర్చు చేసిన మొత్తం

వర్గం గృహాలు రూ.కోట్లలో

చిత్తూరు 9748 రూ.175.48

కుప్పం 5562 రూ.100.11

పుంగనూరు 15665 రూ.281.97

నగరి 4599 రూ.82.78

జీడీ నెల్లూరు 12505 రూ.225.09

పూతలపట్టు 12061 రూ.217.09

పలమనేరు 12131 రూ.218.35

మొత్తం 72272 రూ.1300.87

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement