ఆరోగ్య అభయం
జీవన శైలిలోని మార్పుల వల్లనో, కరోనా శాపమో తెలియదు కానీ పలు రోగాలు జనాన్ని చుట్టిముట్టేస్తున్నాయి. వైద్యంతో నయం కానీ వారికి ఆపరేషన్ శరణ్యంగా మారుతోంది. ఇందుకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో రూ. లక్షల్లో వ్యయమవుతోంది. ఈ భారం భరించలేని పేదలకు ప్రభుత్వం తీపి కబురందించింది. అలాంటి వారికి వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ఊపిరి పోస్తూ కొండంత అండగా నిలుస్తోంది. పేదలపై వ్యయ భారం ఉండకూడదని ప్రస్తుత పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 18న పరిమితి పెంపును సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు.