లాభాల జోరు: 50 వేల ఎగువకు సెన్సెక్స్‌  | Sensex Reclaims 50,000 Nifty Surpasses 14900 | Sakshi
Sakshi News home page

లాభాల జోరు: 50 వేల ఎగువకు సెన్సెక్స్‌ 

Apr 8 2021 10:19 AM | Updated on Apr 8 2021 10:24 AM

Sensex Reclaims 50,000 Nifty Surpasses 14900 - Sakshi

సాక్షి, ముంబై: స్టాక్ మార్కెట్లు లాభాల్లో  ఉత్సాహం​గా కొనసాగుతున్నాయి. బుధవారం నాటి లాభాల ట్రెండ్‌ను గురువారం కూడా అదే ధోరణిని కొనసాగిస్తున్నాయి.   ఆరంభ లాభాల నుంచి మరింత ఎగిసిన సెన్సెక్స్‌   414 పాయింట్ల లాభంతో 50071 వద్ద,  నిఫ్టీ 127 పాయింట్ల లాభంతో 14946 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో ఇటీవల కాస్త నెమ్మదించిన సూచీలు వరసగా మూడో సెషన్‌లో లాభపడుతుండటం విశేషం. నిఫ్టీ బ్యాంక్, ఐటీ ర్యాలీ అవుతున్నాయి.  టాటా స్టీల్, టెక్ మహీంద్రా, హిందాల్కో,విప్రో, బజాజ్ ఫిన్ సర్వ్ లాభపడుతుండగా,  బజాజ్‌ ఆటో, ఓఎన్‌జిసి, నెస్లే, బ్రిటానియా  స్వల్ప నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. 

మరోవైపు దేశంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య రోజుకో కొత్త రికార్డుతో మరింత వణికు పుట్టిస్తోంది. గురువారం అధికారిక గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో  రికార్డు స్థాయిలో 1,26,789 కేసులు నమోదు  కావడం గమనార్హం.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement