అసత్య ప్రచారం.. క్రిప్టోలో ఒక్క రూపాయి ఇన్వెస్ట్ చేయలేదు
సోషల్ మీడియాలో తనపై వస్తున్న కథనాలపై దేశీయ బిజినెస్ టైకూన్ ఆనంద్ మహీంద్రా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆనంద్ మహీంద్రా క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టారంటూ కొన్ని కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఆ కథనాలపై ఆనంద్ మహీంద్రా స్పందించారు. తాను క్రిప్టోలో పెట్టుబడులు పెట్టలేదని, ఆ కథనాలన్నీ అవాస్తవాలేనని కొట్టిపారేశారు.
This would be highly amusing if it wasn’t so unethical &, in fact, dangerous. Someone saw this online & alerted me. I need to make people aware that this is completely fabricated & fraudulent. Takes fake news to a new level. Ironically, I’ve not invested a single rupee in cryptos pic.twitter.com/cfWRDY1J88
— anand mahindra (@anandmahindra) November 19, 2021
అంతేకాదు ఆనంద్ మహీంద్రా క్రిప్టోలో పెట్టుబడి పెట్టారంటూ వచ్చిన కథనాల్ని ట్విట్టర్లో షేర్ చేశారు. కథనాలన్నీ అవాస్తవం. ఈ వార్తలపై పలువురు తనని అప్రమత్తం చేశారని అందుకే స్పందించాల్సి వచ్చిందన్నారు.
చదవండి: ఎంత మంచి పని ! ఈ స్టార్టప్కి నేను అండగా ఉంటా - ఆనంద్ మహీంద్రా