పోచంపల్లి పట్టులో మెరిసిన బెంగాల్‌ ఎంపీ | MP Mahua Moitra Wearing Pochampally Silk Saree Gifted By KTRTRS | Sakshi
Sakshi News home page

పోచంపల్లి పట్టులో మెరిసిన బెంగాల్‌ ఎంపీ

Sep 14 2021 5:21 PM | Updated on Sep 14 2021 5:24 PM

MP Mahua Moitra Wearing Pochampally Silk Saree Gifted By KTRTRS - Sakshi

హైదరాబాద్‌ : పార్లమెంటులో పదునైన ప్రసంగాలతో అధికార పక్షంపై విరుచుకుపడే ఫైర్‌ బ్రాండ్‌ ఎంపీ మహువా మెయిత్రా పోచంపల్లి పట్టులో మెరిసిపోయారు.  భారతీయ హస్తకళలను ఆమె మెచ్చుకుంటూ మోస్ట్‌ బ్యూటిఫుల్‌ పోచంపల్లి కాటన్‌ శారీ అంటూ ప్రశంసలు అందించారు. తెలంగాణ బహుమతిగా మంత్రి కేటీఆర్‌ ఈ చీరను అందించారని పేర్కొంటూ ఆమె ట్వీట్‌ చేశారు. 

ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖలు నిర్వహిస్తోన్న మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బ్రాండ్‌ ప్రమోషన్‌ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ముఖ్యంగా తెలంగాణకి సంబంధించిన హస్త కళలను ఆయన ఎప్పటి నుంచో ప్రమోట్‌ చేస్తున్నారు. తాజాగా ఐటీ స్టాండింగ్‌ కమిటీ సభ్యురాలిగా టీఎంసీ ఎంపీ, ఫైర్‌ బ్రాండ్‌ మహువా మోయిత్రా హైదరాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీ మెయిత్రాకి పోచంపల్లి పట్టు చీరను బహుకరించారు మంత్రి కేటీఆర్‌. ఆ చీరను మరింత ఆధునిక పద్దతిలో ధరించారు ఎంపీ మహువా మెయిత్రా.  

చదవండి : ‘వండర్‌ఫుల్‌ కేటీఆర్‌’.. ఆనంద్‌ మహీంద్రా ప్రశంసలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement