నేటి నుంచి పర్ణశాలలో అధ్యయనోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి పర్ణశాలలో అధ్యయనోత్సవాలు

Dec 20 2025 7:06 AM | Updated on Dec 20 2025 7:06 AM

నేటి నుంచి పర్ణశాలలో అధ్యయనోత్సవాలు

నేటి నుంచి పర్ణశాలలో అధ్యయనోత్సవాలు

దుమ్ముగూడెం: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయానికి అనుబంధ ఆలయంగా ఉన్న పర్ణశాల శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో శనివారం నుంచి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలకు ఆలయ సిబ్బంది ఏర్పాట్లు పూర్తి చేశారు. 9 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో రోజుకో అలంకరణలో స్వామి భక్తులకు దర్శనమిస్తారు. చలువ పందిళ్లు వేసి, ఉత్తరద్వారం వైపు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ నెల 29వ తేదీన గోదావరి తీరంలో తెప్పోత్సవం, 30వ తేదీన ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఉత్తర ద్వార దర్శనం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఇన్‌చార్జ్‌ వాసు వెల్లడించారు. శనివారం మత్స్య అవతారంలో స్వామి దర్శనమివ్వనున్నారు.

ముక్కోటి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement