 
															టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి
టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్కుమార్
ఖమ్మం సహకారనగర్ : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నుంచి ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చకినాల అనిల్కుమార్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. స్థానిక సంఘ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయ శిక్షణ పూర్తిచేసి, డీఎస్సీలో ప్రతిభ కనబరిచి, గత 20 సంవత్సరాలకు పైగా సర్వీసులో ఉన్నవారు మళ్లీ ఉపాధ్యాయ అర్హత పరీక్షలో ఉత్తీర్ణులు కావాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని అన్నారు. ఐటీడీఏలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులు, భాషా పండితుల, పీఈటీల అప్గ్రేడేషన్ పూర్తి చేయాలన్నారు. సమావేశంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎస్.విజయ్, వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి వి.మనోహర్రాజు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.వి.నాగేశ్వరరావు, టి.వెంగళరావు, నాయకులు ఆళ్ల రామారావు, ముత్తయ్య, రమాదేవి, కె.వి, వీరబాబు, మల్ల య్య, నాగిరెడ్డి సంధ్యరాణి, ఉమాదేవి, ఆకుల నాగేశ్వరావు, కోటేశ్వరరావు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
