
●టగ్ ఆఫ్ వార్
దమ్మపేట మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకులంలో బుధవారం ఇందిరా మహిళా శక్తి సంబురాలు నిర్వహించారు. ఈ సంబరాల్లో ముఖ్యఅతిథిగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొనగా, ఐడీసీ చైర్మన్ మువ్వా విజయ్బాబు, ఐటీడీఏ పీఓ రాహుల్, ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులకు టగ్ ఆఫ్ వార్ తదితర ఆటల పోటీలు నిర్వహించారు. పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొనగా మంత్రి శ్రీనివాసరెడ్డి వారిని ప్రోత్సహించడమే కాక విజేతలకు బహుమతులు అందజేశారు.
– దమ్మపేట