రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలి | - | Sakshi
Sakshi News home page

రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలి

Jun 27 2025 4:29 AM | Updated on Jun 27 2025 4:29 AM

రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలి

రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలి

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను కలిగి ఉన్నారంటే భారత రాజ్యాంగమే కారణమని, రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌, షెడ్యూళ్లను ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలని కొత్తగూడెం బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ అన్నారు. సింగరేణి మహిళా డిగ్రీ అండ్‌ పీజీ కళాశాలలో పొలిటికల్‌ సైన్స్‌, హిస్టరీ విభాగం ఆధ్వర్యంలో 75 ఇయర్స్‌ జర్నీ ఆఫ్‌ ద ఇండియన్‌ కాన్సిట్యూషన్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ డ్యూటీస్‌ ఇన్‌ నేషన్‌ బిల్డింగ్‌ అనే అంశంపై గురువారం రాష్ట్రస్థాయి సింపోజియం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడారు. గౌరవ అతిథి మారపాక రమేష్‌, సింగరేణి ఎడ్యుకేషన్‌ సొసైటీ సెక్రటరీ గుండా శ్రీనివాస్‌, జాయింట్‌ సెక్రటరీ జీకే కిరణ్‌కుమార్‌, మేనేజర్‌ మల్లేశం, కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సీహెచ్‌ శారద కూడా మాట్లాడారు. అనంతరం అతిథులను సన్మానించారు. అధ్యాపకురాలు జి మేఘన పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement