రాజ్యాంగాన్ని ఖూనీ చేసిన ఎమర్జెన్సీ | - | Sakshi
Sakshi News home page

రాజ్యాంగాన్ని ఖూనీ చేసిన ఎమర్జెన్సీ

Jun 27 2025 4:29 AM | Updated on Jun 27 2025 4:29 AM

రాజ్యాంగాన్ని ఖూనీ చేసిన ఎమర్జెన్సీ

రాజ్యాంగాన్ని ఖూనీ చేసిన ఎమర్జెన్సీ

మాజీ ఎంపీ సీతారాం నాయక్‌

ఇల్లెందు: ఎమర్జెన్సీ రాజ్యాంగాన్ని ఖూనీ చేసిందని మాజీ ఎంపీ, బీజేపీ నేత ప్రొఫెసర్‌ అజ్మీరా సీతారాం నాయక్‌ అన్నారు. గురువారం ఆయన ఇల్లెందులో విలేకరులతో మాట్లాడారు. ఎమర్జెన్సీ చీకటి రోజులకు 50 ఏళ్లు నిండిందని, నాటి చీకటి రోజుల్లో ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారని అన్నారు. ఈ ప్రాంతంలో ఎంపీలు ఒక్క ప్రాజెక్ట్‌ కూడా తీసుకురాలేక పోయారని విమర్శించారు. సీతారామ ప్రాజెక్ట్‌, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, జాతీయ రహదారులకు అతీగతీ లేదని అన్నారు. కాళేశ్వరం కమీషన్‌, ఫోన్‌ ట్యాపింగ్‌, ఈ–రేస్‌ అంటూ సీరియల్స్‌ నడపటం తప్ప కేసీఆర్‌ను అరెస్ట్‌ చేసే దమ్ము సీఎం రేవంత్‌కు లేదన్నారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, నాయకులు గోపీకృష్ణ, సుచిత్ర ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement