
ఫార్చునర్ కారులో గంజాయి రవాణా!
● 21.5 కేజీలు స్వాధీనం ● ఐదుగురు నిందితుల అరెస్ట్
మణుగూరు టౌన్: ఒడిశా నుంచి హైదరాబాద్కు ఫార్చునర్ కారులో తరలిస్తున్న గంజాయిని మణుగూరులో ఎకై ్సజ్ అధికారులు గురువారం పట్టుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్ సీఐలు సుంకర రమేశ్, రాజిరెడ్డి కథనం ప్రకారం... హైదరాబాద్కు చెందిన షేక్ సమీర్, సయ్యద్ అబూబకర్, ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచకు చెందిన తానంకి ప్రవీణ్, కోట హరీశ్, యశ్వంత్కుమార్లు గంజాయికి అలవాటుపడి స్నేహితులుగా మారారు. ఒడిశాలోని మల్కన్గిరి నుంచి హైదరాబాద్లోని పాతబస్తీకి కారులో 21.5 కేజీల గంజాయి తరలిస్తున్నారు. ఈ క్రమంలో మణుగూరులోని రథంగుట్ట అర్బన్ పార్క్ వద్ద ఎకై ్సజ్ అధికారులు పట్టుకున్నారు. గంజాయితోపాటు కారు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ రూ. 13 లక్షలు ఉంటుందని, నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని అధికారులు తెలిపారు. ఈ కేసుతో సంబంధం ఉన్న హైదరాబాద్కు చెందిన షేక్ పైసల్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు.