
డిగ్రీ పరీక్ష ఫలితాలు విడుదల
ఐదో సెమిస్టర్లో 50.56,
ఆరో సెమిస్టర్లో 50.16శాతం ఉత్తీర్ణత
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించిన డిగ్రీ ఐదు, ఆరో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను గురువారం విడుదల చేశారు. కేయూ క్యాంపస్లో వీసీ కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం, పరీక్షల విభాగం అధికారులతో కలిసి ఫలితాలను విడుదల చేయగా పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ వివరాలు వెల్లడించారు. ఐదో సెమిస్టర్ పరీక్షలకు 13,963 మంది విద్యార్థులు హాజరుకాగా, 7,059 మంది (50.56శాతం) ఉత్తీర్ణులయ్యారని, ఆరో సెమిస్టర్ పరీక్షల్లో 37,999మందికి 19,060 (50.16శాతం) మంది ఉత్తీర్ణులయ్యారని వివరించారు. కాగా, ఫలితాలపై రీవాల్యుయేషన్కు విద్యార్థులు దరఖాస్తు చేసుకునే అవకాశముందని అధికారులు తెలిపారు. పదిహేను రోజుల్లోగా ఆన్లైన్ ద్వారా వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు.