
సీహెచ్సీలో వైద్యుల నియామకం
బూర్గంపాడు: ఎట్టకేలకు బూర్గంపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్సీ)లో ముగ్గురు వైద్యులను నియమించారు. ‘సీహెచ్సీనా.. డెంటల్ ఆస్పత్రా!’ శీర్షికన ఈనెల 11న సాక్షిలో ప్రచురితమైన కథనానికి వైద్యావిధాన పరిషత్ అధికారులు స్పందించారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశాల మేరకు డీసీహెచ్ఎస్ రవిబాబు.. సీహెచ్సీలో ముగ్గురు వైద్యులను నియమించారు. వీరిలో ఇద్దరు ఎంబీబీఎస్ డాక్టర్లు కాగా, ఒకరు గైనకాలజిస్ట్ ఉన్నారు. కాగా, ఈ ఆస్పత్రిలో ప్రసవాలు జరిగేలా చూడాలని పలుమార్లు కలెక్టర్ ఆదేశించినా గైనకాలజిస్ట్ లేక డెలివరీలు చేయడం లేదు. ఎట్టకేలకు గైనకాలజిస్ట్ నియామకంతో ప్రసవాలు పెరిగే అవకాశాలున్నాయి. గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రావణి విధుల్లో చేరిన తొలిరోజే ఓ గర్భిణికి సుఖప్రసవం చేయడం విశేషం.