
రామయ్యకు కాసుల పంట
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి కాసుల పంట పండింది. చిత్రకూట మండపంలో గురువారం ఆలయ హుండీలను లెక్కించగా రూ.1,97,79,049తో పాటు 65 గ్రాముల బంగారం, 1.5 కేజీల వెండి, విదేశీ ద్రవ్యం లభించాయని ఈఓ రమాదేవి తెలిపారు. గత మే 6న చివరిసారి హుండీలు లెక్కించారు. ఇప్పుడు 50 రోజుల్లో రూ.2 కోట్లకు దగ్గరగా ఆదాయం సమకూరడం విశేషం. వేసవి సెలవుల నేపథ్యంలో మే, జూన్ నెలల్లో ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదాయం భారీగా రావడంతో ఆలయ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. హుండీ లెక్కింపు అనంతరం నగదును బ్యాంకు అఽధికారులకు అందజేశారు.
50 రోజుల హుండీ
ఆదాయం రూ.1.97 కోట్లు