
శంకుస్థాపన శిలాఫలకం ధ్వంసం
అశ్వాపురం: మండల పరిధిలోని తుమ్మలచెరువులో లోతువాగుపై వంతెన శంకుస్థాపన శిలాఫలకాన్ని మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పగులగొట్టారు. హైలెవల్ వంతెన నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో రూ.3 కోట్లు మంజూరు కాగా అప్పటి మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎమ్మెల్యే రేగా కాంతారావు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎన్నికలు రావడంతో పనులు చేపట్టలేదు. నూతన ప్రభుత్వంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చొరవ తీసుకొని వంతెన పనులు పూర్తి చేయించారు. బుధవారం ఎమ్మెల్యే పాయం వంతెనను ప్రారంభించనుండగా, మంగళవారం రాత్రి శంకుస్థాపన శిలాఫలకం పగులగొట్టారు. రేగా కాంతారావు పేరు ఉండకూడదని కాంగ్రెస్ శ్రేణులు ధ్వంసం చేశాయని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తుండగా, బీఆర్ఎస్ పార్టీ వాళ్లే ప్రచారం కోసం ధ్వంసం చేశారని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఆర్అండ్బీ వర్క్ ఇన్స్పెక్టర్ కృష్ణ ఫిర్యాదుతో సీఐ అశోక్రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పీవీకే–5 ఇంక్లైన్లో కేబుల్ అపహరణ
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని పీవీకే–5 ఇంక్లైన్ గని ప్యాన్ ఆవరణలోని కాపర్ కేబుల్ చోరీ జరిగిన విషయం ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. కొత్తగూడెం ఏరియాలో మాజీ సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు మృతి ఈ నెల 23న మృతి చెందగా, 24న అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ క్రమంలో సెక్యూరిటీ సిబ్బంది దిగ్బ్రాంతికిలోనై అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఇది అదునుగా భావించిన దొంగలు ఈ నెల 23, 24 రెండు రోజుల్లో కాపర్ కేబుల్ను ఎత్తుకెళ్లినట్లు సీసీ కెమెరాల ఫుటేజీలో నిక్షిప్తమైంది. సుమారు 10 మీటర్లు కేబుల్ చోరీకి గురైందని సిబ్బంది చెబుతుండగా, విచారణలో పూర్తి వివరాలు తేలాల్సి ఉంది. ఈ విషయమై ఏరియా సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ అభిలాష్ను వివరణ కోరగా.. చోరీ చేసినవాళ్లను గుర్తించామని, గురువారం పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.