
అడవి బిడ్డకు అనారోగ్యం..
కరకగూడెం: ఏజెన్సీ ప్రాంతంలో రహదారులు లేక అడవి బిడ్డల కష్టాలకు పరిష్కారం లభించడం లేదు. కరకగూడెం మండలంలో వలస ఆదివాసీ గ్రామమైన నీలాద్రిపేటలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. నీలాద్రిపేటకు చెందిన మడివి ఉంగమ్మకు బుధవారం వాంతులు, విరేచనాలు తీవ్రమై ఆరోగ్యం విషమించింది. దీంతో కుటుంబీకులు 108 అంబులెన్స్కు సమాచారం ఇవ్వగా నీలాద్రిపేటకు సరైన రహదారి లేక వాహనం వచ్చే పరిస్థితి కనిపించలేదు. దీంతో వైద్యంలో జాప్యం జరుగుతుందని భావించిన ఉంగమ్మ భర్త జోగ య్య, తదితరులు డోలీ కట్టి ఆమెను అటవీ మార్గంలో బురద, ఎగుడుదిగుడు మార్గంలో ఆరు కి.మీ. మేర మోస్తూ రెండు గంటల అనంతరం అశ్వాపురంపాడు మీదుగా మోతె సమీపంలోని ప్రధాన రహదారి వద్దకు చేర్చారు. అక్కడ సిద్ధంగా ఉన్న 108లో ఉంగమ్మను మణుగూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు.
డోలీలో ఆరు కి.మీ. మోసుకెళ్లిన కుటుంబీకులు

అడవి బిడ్డకు అనారోగ్యం..