మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

Jun 25 2025 6:43 AM | Updated on Jun 25 2025 6:43 AM

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

కొత్తగూడెంటౌన్‌: విద్యార్థులు, యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎస్పీ రోహిత్‌రాజు అన్నారు. తన కార్యాలయంలో మంగళవారం మాదకద్రవ్య నివారణ వారోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాఽలకు బానిస కావొద్దని సూచించారు. డ్రగ్‌ నిర్మూలన సోల్జర్‌గా నమోదు చేసుకునేందుకు లింక్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే దుష్పరిణామాలపై పోలీస్‌ శాఖ తరఫున అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా మత్తు పదార్థాలు విక్రయించినా, సేవించినట్లు తెలిసినా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో డీసీఆర్బీ డీఏస్పీ మల్లయ్యస్వామి, సీఐ శ్రీనివాస్‌, ఎస్బీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, వన్‌టౌన్‌ సీఐ కరుణాకర్‌, ఐటీ సెల్‌ రాము, జూలూరుపాడు, అశ్వారావుపేట సీఐలు ఇంద్రసేనారెడ్డి, నాగరాజురెడ్డి, ఆర్‌ఐలు నర్సింహారావు, కృష్ణారావు పాల్గొన్నారు.

నిరుపయోగ వస్తువులకు రేపు వేలం

జిల్లా పోలీసు శాఖలో నిరుపయోగ వస్తువులను ఈ నెల 26న వేలం వేస్తామని ఎస్పీ రోహిత్‌రాజు ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసు హెడ్‌ క్వార్టర్స్‌లో వేలం ఉంటుందని, కంప్యూటర్‌, మానిటర్లు, సీపీయూలు, కీ బోర్డులు, మౌస్‌లు, యూపీఎస్‌లు, ట్యాబ్‌లు, యాపిల్‌ ఐపాడ్‌లు, ఇన్వెర్టర్‌, ఇన్వర్టర్‌ బ్యాటరీలు, డ్రాగన్‌ లైట్లు, టెంట్‌లు, టేబుళ్లు, కుర్చీలు, బీరువా తదితర వస్తువులను వేలం వేస్తామని వివరించారు. పాల్గొనేవారు జిరాక్స్‌, ఒరిజినల్‌ ఆధార్‌ కార్డు తీసుకురావాలని, వివరాలకు 87126 82143 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement