
● జీసీసీ నుంచే ఆలస్యం
పాల్వంచరూరల్ : వర్షాకాలంలో పేదలు ఇబ్బంది పడకుండా మూడు నెలల బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినా.. క్షేత్రస్థాయిలో జాప్యంతో లబ్ధిదారులు ఇబ్బంది పడ్డాల్సి వస్తోంది. పాల్వంచ మండలంలోని కొన్నిషాపులకు జీసీసీ పాయింట్ నుంచి బియ్యం సరఫరా ఆలస్యమవుతోంది. మరికొన్ని చోట్ల వేలిముద్రలు పడక, మిషన్లకు సిగ్న ల్ అందక డీలర్లు, లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. కిన్నెరసాని షాప్ పరిధిలో 556 రేషన్కార్డులకు గాను 308.18 క్వింటాళ్ల బియ్యం వచ్చా యి. ఇందులో ఇప్పటివరకు 251 క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేయగా ఇంకా 57క్వింటాళ్లు మిగిలి ఉన్నా యి. లక్ష్మీదేవిపల్లి షాప్ పరిధిలో 962 రేషన్కార్డులు ఉండగా ఇంకా 150 మందికి బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. జీసీసీ పాయింట్ నుంచి బియ్యం సరఫరాలో జాప్యంతోనే మిగిలిన వారికి బియ్యం అందించలేదని డీలర్ వెంకటేశ్వర్లు తెలిపారు.
మూడుసార్లు తిరిగినా బియ్యం ఇవ్వలే
మూడు నెలల బియ్యం ఇస్తున్నారంటే ఇప్పటికి మూడు సార్లు వచ్చినా ఇంకా ఇవ్వలేదు. జీసీసీ పాయింట్ నుంచి బియ్యం రాలేదని డీలర్ అంటున్నాడు. బియ్యం పంపిణీ గడువు పెంచి అందరికీ వచ్చేలా చూడాలి.– తేనె వెంకటేశ్వర్లు, లబ్ధిదారుడు