
రైతు భరోసాను సద్వినియోగం చేసుకోవాలి
పాల్వంచరూరల్: వానాకాలంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రైతు భరోసా డబ్బులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ విద్యాచందన పేర్కొన్నారు. మండలంలోని జగన్నాథపురం గ్రామంలోని రైతువేదికలో మంగళవారం సీఎం రేవంత్రెడ్డి రైతులతో నిర్వహించిన ముఖాముఖిలో అదనపు కలెక్టర్ హాజరై మాట్లాడారు. ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్ల నిధులను రైతు ల ఖాతాల్లో జమ చేశారని తెలిపారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, ఏడీఏ యు.నర్సింహారావు, ఎంపీడీఓ కె.విజయభాస్కర్రెడ్డి, ఏఓ శంభోశంకర్, సీడీపీఓ లక్ష్మీప్రసన్న, ఏపీఓ పొరండ్ల రంగా, ఏపీఎం రాంబాబు, పంచాయతీ కార్యదర్శులు చెన్నకేశవ, ఏఈఓలు సత్యం, శాంతి, ఇతర శాఖల అధికారులు కె.వెంకటేశ్వర్లు, మాధవీలత, అశోక్కుమారి తదితరులు పాల్గొన్నారు.