జర్నలిస్టు పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ | - | Sakshi
Sakshi News home page

జర్నలిస్టు పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ

Jun 25 2025 6:43 AM | Updated on Jun 25 2025 6:43 AM

జర్నలిస్టు పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ

జర్నలిస్టు పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ

కొత్తగూడెంఅర్బన్‌: జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టు పిల్లలకు ప్రైవేట్‌ పాఠశాలల్లో 50 శాతం ఫీజు రాయితీ కల్పిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. వెంకటేశ్వరాచారి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్టు నాయకులు రాయితీ కోసం వినతిపత్రం అందజేయగా, స్పందించి వెంటనే 50 శాతం ఫీజు రాయితీని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కల్లోజి శ్రీనివాస్‌, ఎండీ షఫీ, టెంజు జిల్లా అధ్యక్షులు వట్టికొండ రవి, నేషనల్‌ కౌన్సిల్‌ సభ్యులు చండ్ర నరసింహారావు, జర్నలిస్టులు కృష్ణ్ణగోవింద్‌, ప్రభాకర్‌రెడ్డి, రాజ్‌కుమార్‌, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement