
మున్సిపాలిటీల్లో పదోన్నతులు, బదిలీలు
అశ్వారావుపేట/ఖమ్మంమయూరిసెంటర్: మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పలువురు ఉద్యోగులను బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఖమ్మం నగరపాలక సంస్థ అసి స్టెంట్ కమిషనర్ అహ్మద్ షఫీ ఉల్లాను జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్గా బదిలీ చేశారు. అలాగే, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ జె.అనిల్కుమార్కు పదోన్నతి కల్పించి కేఎంసీ అసిస్టెంట్ కమిషనర్గా నియమించారు.అంతేకాకుండా మధిర, వైరా కమిషనర్లుగావిధులు నిర్వర్తిస్తున్న ఏ.సంపత్కుమార్, సీహెచ్.వేణును అక్కడే పూర్తిస్థాయి కమిషనర్లుగా పోస్టింగ్ ఇచ్చా రు. అంతేకాక పలు మున్సిపాలిటీల్లో జూనియర్ అసిస్టెంట్లకు పదోన్నతి కల్పించి పోస్టింగ్ ఇచ్చారు. కొత్తగూడెంలో పనిచేస్తున్న జె.సుజితకు కేఎంసీలో సీనియర్ అసిస్టెంట్గా, ఇల్లెందులో పనిచేస్తున్న బి.సుధీర్కు వైరాలో, కేఎంసీలో పనిచేస్తున్న డి.నాగరాజుకు కొత్తగూడెం కార్పొరేషన్లో, సత్తుపల్లిలో పనిచేస్తున్న బి.రామచంద్రుకు కేఎంసీలో పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. అలాగే, ఇల్లెందులో పనిచేస్తున్న ఎం.వీరకుమారి, మధిరలో పని చేస్తున్న ఆర్.నాగలక్ష్మి, కొత్తగూడెంలో పనిచేస్తున్న మూడ్ అశోక్, పి.సరస్వతికి పాత కేంద్రాల్లోనే పోస్టింగ్ ఇవ్వగా, మహబూబాబాద్లో విధులు నిర్వర్తిస్తున్న కే.పీ.దిలీప్కుమార్ను సత్తుపల్లి సీనియర్ అసిస్టెంట్గా నియమించారు.
విధుల్లో చేరిన అశ్వారావుపేట కమిషనర్
గ్రేడ్–3 కమిషనర్గా పదోన్నతి పొందిన బి.నాగరాజును భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట కమిషనర్గా నియమించారు. దీంతో ఇన్నాళ్లు ఇన్చార్జ్ కమిషనర్గా వ్యవహరించిన సుజాత నుంచి బాధ్యతలు స్వీకరించిన నాగరాజు ఆతర్వాత ఎమ్మెల్యే జారె ఆదినారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు. దీంతో కొత్త కమిషనర్ను ఎమ్మెల్యే సన్మానించి మున్సిపాలిటీలో అమలు చేస్తున్న వంద రోజుల ప్రణాళికపై సూచనలు చేశారు.
అశ్వారావుపేట కమిషనర్గా నాగరాజు