
‘సీతారామ’ జలాలు ఇవ్వకపోతే సహించం..
మణుగూరురూరల్: సీతారామ జలాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులకు ఇవ్వకుండా అన్యాయం చేయాలని చూస్తే సహించబోమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతా రావు అన్నారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల రైతాంగానికి సంబంధించి పదిలక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టి 90 శాతం నిధులతో పనులను పూర్తి చేసిందన్నారు. రాష్ట్రంలో మాయమాటలతో అధికా రంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఉమ్మడి జిల్లా మంత్రులు పూసగూడెం వద్ద ప్రాజెక్ట్ను ప్రారంభించి ఈ జిల్లాకు నీరు ఇవ్వకుండా ఖమ్మం జిల్లాకు తరలించుకుపోవడం దుర్మార్గమని, ప్రజా ప్రభుత్వం, రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటు న్న కాంగ్రెస్ మంత్రులు.. నేడు జిల్లా రైతాంగాన్ని విస్మరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ నెల 30వ తేదీన జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ నేతృత్వంలో పూసగూడెం నిరసన చేపట్టనున్న ట్లు తెలిపారు. సమావేశంలో కుర్రి నాగేశ్వరరావు, కుంటా లక్ష్మణ్, పోశం నర్సింహరావు, వేర్పుల సురేశ్, అక్కి నర్సింహారావు, యాదగిరిగౌడ్, రామ కోటి, సృజన్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు