
రద్దయిన రైళ్లను పునరుద్ధరించాలి
కొత్తగూడెంఅర్బన్: సికింద్రాబాద్లోని రైల్వే భవన్లో మంగళవారం జరిగిన సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు డీఆర్యూసీసీ సమావేశంలో కొత్తగూడెం నుంచి డీఆర్యూసీసీ సభ్యుడు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సౌత్ సెంట్రల్ రైల్వే డీఆర్ఎం బర్తేశ్కుమార్ జైనీకి వినతిపత్రం అందజేశారు. అనంతరం సమావేశంలో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. కరోనా సమయంలో రద్దయిన రైళ్లను పునరుద్ధరించాలని కోరారు. మణుగూరు నుంచి కొత్తగూడెం మీదుగా తిరుపతి, షిరిడీకి ప్రత్యేక రైలు నడపాలని, సింగరేణి, కాకతీయ రైళ్లను పాత పద్ధతిలో అదనంగా భోగీలు ఏర్పాటు చేసి నడిపించాలన్నారు. రైల్వే అధికారులు మాట్లాడుతూ.. త్వరలోనే మణుగూరు టు కొత్తగూడెం మీదుగా తిరుపతి, షిరిడీకి ప్రత్యేక రైలు ఏర్పాటు చేస్తామని, రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయిస్తామని వివరించారు. సమావేశంలో సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ డివిజన్ ఏడీఆర్ఎం డాక్టర్ ఆర్.గోపాలకృష్ణన్, సీనియర్ డీసీఎం సిపాలికుమార్, సీనియర్ డీఓఎం డాక్టర్ సురేశ్రెడ్డి, డీసీఎం బి.చరణ్నాయక్, గూడ్స్ డీసీఎం విశాల్ అర్జున్, డీఆర్యూసీసీ సభ్యులు పాల్గొన్నారు.