
వరి నాట్లు వేసిన ఎమ్మెల్యే
దమ్మపేట: మండలంలో పర్యటించిన స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నాచారం గ్రామంలో వరి నాట్లు వేస్తున్న మహిళలతో కలిసి నాట్లు వేశారు. మంగళవారం మండలంలోని లింగాలపల్లి, జమేదారుబంజర, గుర్వాయిగూడెం, పార్కలగండి, అంకంపాలెం, అర్లపెంట, కొడిసెలగూడెం, చెన్నువారిగూడెం, జగ్గారం, నాగుపల్లి, నాచారం, తొట్టిపంపు, మొద్దులగూడెం, అల్లిపల్లి, మల్కారం, పెద్దగొల్లగూడెం, దమ్మపేట గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. రూ.3,44,50,000 వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, పాఠశాల ప్రహరీలు, తాగునీటి బోర్లు, పైపులైన్లను ప్రారంభించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. నాచారంలో లయన్స్క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. పలు గ్రామాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న పలువురిని పరామర్శించి, వైద్య సహాయం అందజేస్తానని హామీ ఇచ్చారు. దమ్మపేటలో ఉపాధి హామీ కూలీలకు గడ్డపారలు, బాల్చాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి, ఎంపీడీఓ చంద్రశేఖరరెడ్డి, ఎంపీఓ రామారావు, ఏఈలు, డీఈలు, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.