
ఎస్బీఐ ఆధ్వర్యాన రక్తదానం
ఖమ్మంగాంధీచౌక్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) 70వ వ్యవస్థాపక వేడుకల్లో భాగంగా మంగళవారం ఖమ్మం మమత కాలేజ్ రోడ్డు బ్రాంచ్లో రక్తదాన శిబిరం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా 123 మంది ఎస్బీఐ ఉద్యోగులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన బ్యాంక్ రీజినల్ మేనేజర్ బి.రాజేఖర్ మాట్లాడుతూ ప్రమాదకర పరిస్థితిలో ఉన్న వారిని ఆదుకోవడంలో రక్తదానం కీలకంగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం మోహన్నాయక్, బ్యాంక్ ఆఫీసర్ల అసోసియేషన్ ఏజీఎస్ షేక్ ఇబ్రహీం, రీజనల్ సెక్రటరీ ఆర్.శివకుమార్, హెచ్ఆర్ మేనేజర్ ఉదయ్, స్టాఫ్ యూనియన్ వైస్ ప్రసిడెంట్ నందన్, రీజనల్ సెక్రటరీ చిన్నపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.