
ఆదివాసీలు ఆర్థికంగా ఎదగాలి
కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ
ప్రత్యేకాధికారి సుభాష్
అశ్వారావుపేటరూరల్/ములకలపల్లి: గిరిజనులు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని, ఆర్థికంగా ఎదగాలని కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ ప్రత్యేకాధికారి సుభాష్ సూచించారు. సోమవారం ఆయన ములకలపల్లి మండలం మూకమామిడిలో, అశ్వారావుపేట మండలం రెడ్డిగూడెం, తిరుమలకుంట, గోగులపూడి గ్రామాల్లో నిర్వహించిన ధర్తీ ఆభా జన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష అభియాన్ యోజన సదస్సులకు హాజరై మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందేందుకు వ్యక్తిగత గుర్తింపు కార్డులు అవసరమని, అందుకోసమే గ్రామాల్లో ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా గిరిజన రైతుల పంట పొలాలకు విద్యుత్, బోరు, మోటారు ఏర్పాటుకు సబ్సిడీ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కొండరెడ్ల, ఆదివాసీ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు, రుణాలు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. గోగులపూడి గ్రామంలో కొండరెడ్ల గిరిజనులు వెదురుతో తయారీ చేసిన కళాఖండాలను పరిశీలించారు. ములకలపల్లి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ను సందర్శించి బోధనాతీరుపై ఆరా తీశారు. అధికారులు సున్నం రాంబాబు, భాస్కర్రావు, గద్దె రేవతి, భాగ్యలక్ష్మి, డాక్టర్ ప్రదీప్కుమార్, రామకృష్ణ, ప్రవీణ్ కుమార్, సంపత్కుమార్, సురేశ్కుమార్, వరప్రసాద్, గఫూర్ పాషా, శివరాంప్రసాద్, మధులిక, రాందాస్ నాయక్, బాపనయ్య, ప్రసాద్ పాల్గొన్నారు.