వాతావరణ ం | - | Sakshi
Sakshi News home page

వాతావరణ ం

Jun 24 2025 3:41 AM | Updated on Jun 24 2025 3:41 AM

వాతావరణ ం

వాతావరణ ం

జిల్లాలో మంగళవారం ఉదయం వర్షపు జల్లులు కురిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం ఆకాశంలో మబ్బులు కమ్మేయవచ్చు.

ఆయిల్‌పామ్‌ మొక్కలపై సమగ్ర నివేదిక ఇవ్వాలి

జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యుడి ఆదేశం

అశ్వారావుపేట: ఉమ్మడి జిల్లాలోని అశ్వారావుపేట, సత్తుపల్లి మండలం రేగళ్లపాడు నర్సరీల ద్వారా రైతులకు పంపిణీ చేసిన ఆయిల్‌పామ్‌ మొక్కలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జాతీయ ఎస్టీ కమిషన్‌ సూచించింది. ఈ రెండు నర్సరీల ద్వారా ఇచ్చిన మొక్కల్లో ఆఫ్‌టైప్‌ రావడంతో రూ.లక్షల్లో నష్టపోయామని పలువురు రైతులు ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో సోమవారం హైదరాబాదులో ఎస్టీ కమిషన్‌ సభ్యుడు జాటోత్‌ హుస్సేన్‌నాయక్‌ విచారణ చేపట్టారు. ఆయిల్‌ఫెడ్‌, ఉద్యానశాఖ అధికారులతో పాటు బాధిత రైతులు హాజరవగా 2016 – 2022 మధ్యలో పంపిణీ చేసిన ఆయిల్‌పామ్‌ మొక్కల ఎదుగుదల, దిగుబడిపై సమగ్ర నివేదిక నెలలోగా అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఐఐఓపీఆర్‌ శాస్త్రవేత్తలు సందర్శనకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. విచారణకు ఉద్యానశాఖ కమిషనర్‌ యాష్మిన్‌ బాషా, ఆయిల్‌ఫెడ్‌ ఎండీ శంకరయ్య, ఓఎస్డీ అడప కిరణ్‌, ప్రవీణ్‌రెడ్డి, రైతులు కారం శ్రీరాములు, మడివి బాలరాజు, కొండ్రు మురళి, చెలికాని వెంకట్‌, తుంబూరు ఉమామహేశ్వరరెడ్డి తదితరులు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement