
నల్లబెల్లం, పటిక స్వాధీనం
పాల్వంచ: నాటు సారా తయారీ కోసం నల్లబెల్లం, పటిక తరలిస్తున్న బొలేరో వాహనాన్ని పోలీసులు స్వా ధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్ డీసీజి.జనార్ధన్రెడ్డి ఆదేశాల మేరకు ఆది వారం పట్టణంలోని దమ్మపేట సెంటర్లో వాహన తనిఖీలు చేపట్టారు. ఈక్రమంలో బొలేరో వాహనాన్ని ఆపి తనిఖీచేయగా.. 4,025కేజీల నల్లబెల్లం, 20 కేజీ ల పటిక,10లీటర్ల నాటుసారా,2 సెల్ఫోన్లు ఉన్న ట్లు గుర్తించి స్వాధీనం చేసుకుని, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పాల్వంచలోని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కార్యాలయంలో అప్పగించారు. తనిఖీల్లో ఎస్ఐ సీహెచ్.శ్రీహరిరావు, హెడ్ కానిస్టేబుల్ కరీం, కానిస్టేబుళ్లు వెంకట్, హరీష్, వీరబాబు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. మత్తుపదార్థాల రవాణా, వినియోగంపై ఏదైనా సమాచారం ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 18004252523 సంప్రదించాలని కోరారు.