రామయ్యకు సువర్ణ తులసీ అర్చన | - | Sakshi
Sakshi News home page

రామయ్యకు సువర్ణ తులసీ అర్చన

Jun 22 2025 3:36 AM | Updated on Jun 22 2025 3:36 AM

రామయ్

రామయ్యకు సువర్ణ తులసీ అర్చన

భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. ఆ తర్వాత స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని శాస్త్రక్తంగా జరిపించారు.

ఈ – టికెట్లపై భక్తులకు అవగాహన

భద్రాచలం: భక్తుల సమయాన్ని ఆదా చేసేందుకు దర్శనం, ప్రసాదాలు ఇతర సేవలకు గాను రామాలయంలో ఏర్పాటు చేసిన మిషన్లపై ఈఓ ఎల్‌.రమాదేవి శనివారం భక్తులకు అవగాహన కల్పించారు. తొలుత ఈ మిషన్లకు పూజలు నిర్వహించాక యంత్రాల్లో ఉన్న సదుపాయాలు, ఈ టికెట్లు పొందే విధానం గురించి వివరించారు. భక్తులు ఈ సౌకర్యాన్ని సద్విని యోగం చేసుకోవాలని కోరారు. భక్తులు సైతం ఈ టికెట్లు తీసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఈ రవీందర్‌, ఏఈఓ భవాని రామకృష్ణ, అర్చకులు పాల్గొన్నారు.

రూ. 270.92 కోట్ల

రైతు భరోసా జమ

డీఏఓ బాబూరావు వెల్లడి

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): ఇప్పటి వరకు 1,70,764 మంది రైతులకు రూ. 270, 92, 33,145 వారి బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా జమ చేసినట్లు జిల్లా వ్యవసాయ శాఖాధికారి వి.బాబూరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో గత యాసంగిలో ఉన్న పట్టాదారుల సంఖ్య 1,78, 545 కాగా, ఈ వానాకాలం సీజన్‌ నాటికి కొత్తగా 1,023 మంది పట్టాలు పొందారని పేర్కొన్నారు. గత సీజన్‌లో బ్యాంకు వివరాలు సరిగా లేని పట్టాదారులు 832 మంది ఉన్నారని, అసలే నమోదు చేయని వారు 550 మంది ఉన్నారని వివరించారు. వానాకాలం సీజన్‌కు సంబంధించి జిల్లాలో 1,80,119 మంది లబ్ధిదారుల వివరాలను వ్యవసాయ విస్తరణాధికారుల ద్వారా సేకరించి పోర్టల్‌లో నమోదు చేశామని, ఈనెల 21 వరకు 1,76,506 మంది రైతుల కోసం రూ. 305,87,04,190 ట్రెజరీకి పంపామని, అందులో ఈనెల 20వరకు 1,63,360 మంది లబ్ధిదారులకు రూ.237,58,19,701 వారి బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయని వివరించా రు. శనివారం 14,642 మంది రైతుల ఖాతాల్లో రూ. 51,31,26,190 జమ చేశామని తెలిపారు.

కార్మికచట్టాల రక్షణకు పోరాటం

ఖమ్మంమయూరిసెంటర్‌: ప్రజా రవాణా రంగంతో పాటు కార్మిక చట్టాలను కాపాడుకునేలా ప్రజా ఉద్యమాలకు రూపకల్పన జరగాలని అఖిల భారత రోడ్డు రవాణా కార్మికుల సమాఖ్య(ఏఐఆర్‌డబ్ల్యూఎఫ్‌) జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్‌.లక్ష్మయ్య అన్నారు. ఇందుకు స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌(సీఐటీయూ అనుబంధం) మహాసభలు వేదిక కావాలని సూచించారు. ఖమ్మంలో శనివారం ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర నాలుగో మహాసభలు ప్రారంభం కాగా, లక్ష్మయ్య మాట్లాడుతూ 2019 మోటారు వాహనాల చట్టం సవరణతో కేంద్ర ప్రభుత్వం రవాణా సంస్థలకు సమాధి కట్టేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. వచ్చేల 9న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో ఆర్టీసీ కార్మిక వర్గం పాల్గొనాలని కోరారు. సభలో ఆయా సంఘాల నాయకులు థామస్‌రెడ్డి, అశ్వద్ధామరెడ్డి, పాటి అప్పారావు, బత్తినేని హనుమంతరావు, వీ.ఎస్‌.రావు, కళ్యాణం వెంకటేశ్వరరావు, పి.శ్రీకాంత్‌, సీహెచ్‌.సుందరయ్య, ఎంఎన్‌. రెడ్డి, వి.రాములు పాల్గొన్నారు.

రామయ్యకు  సువర్ణ తులసీ అర్చన1
1/2

రామయ్యకు సువర్ణ తులసీ అర్చన

రామయ్యకు  సువర్ణ తులసీ అర్చన2
2/2

రామయ్యకు సువర్ణ తులసీ అర్చన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement