సంస్కృత పండితుడికి సన్మానం | - | Sakshi
Sakshi News home page

సంస్కృత పండితుడికి సన్మానం

Jun 22 2025 3:36 AM | Updated on Jun 22 2025 3:36 AM

సంస్క

సంస్కృత పండితుడికి సన్మానం

భద్రాచలంటౌన్‌: భద్రాచల దేవస్థానంలో సంస్కృత పండితుడిగా పనిచేస్తున్న ఎస్‌టీజీ శ్రీమన్నారాయణ ఆచార్యులును భద్రాద్రి దేవస్థానం, ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చిత్రకూట మండపంలో శనివారం ఘనంగా సన్మానించారు. వేలాది మంది విద్యార్థులకు సంస్కృత భాషను బోధించిన ఆయన ఇటీవల ప్రాచ్య విద్య విభూషణం బిరుదు అందుకున్నారు. ఈ సందర్భంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎల్‌. రమాదేవి, ఏఈఓలు శ్రవణ్‌ కుమార్‌, భవాని రామకృష్ణ, శ్రీనివాస్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అయ్యప్ప కాలనీలో నివాసాల కూల్చివేత

భద్రాచలంఅర్బన్‌: పట్టణంలోని అయ్యప్ప కాలనీలో ఉన్న 40 నివాసాలను శనివారం గ్రామ పంచాయతీ అధికారులు జేసీబీ యంత్రాలతో కూల్చివేశారు. ఈ ఇళ్లలో ఉండే వారికి రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌లో డబుల్‌ బెడ్రూం ఇళ్లను కేటాయించిందని గ్రామ పంచాయతీ అధికారి శ్రీనివాస్‌ తెలిపారు. ఈ ప్రాంతంలో కలెక్టర్‌ ఆదేశాల ప్రకారం జామాయిల్‌ మొక్కలను నాటి, సంరక్షిస్తామని పేర్కొన్నారు. కాగా ఇప్పటికే అశోక్‌నగర్‌ కొత్తకాలనీలో గత నెలలో 41 నివాసాలను సంబంధిత అధికారులు కూల్చివేశారు.

భూ వివాదంలో ఘర్షణ

దుమ్ముగూడెం: మండల పరిధిలోని గోవిందాపురం గ్రామానికి చెందిన సవలం మల్లేష్‌, సవలం నాగేశ్వరరావు భూ వివాదం నేపథ్యంలో శనివారం రాత్రి గొడవ పడ్డారు. ఈ క్రమంలో నాగేశ్వరరావు కత్తితో దాడి చేయడంతో మల్లేష్‌కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో భద్రాచలం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడు నాగేశ్వరరావు పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోగా, ఘటన స్థలాన్ని దుమ్ముగూడెం సీఐ అశోక్‌ పరిశీలించారు.

విద్యార్థులపై

శ్రద్ధ చూపాలి

భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్‌

పాల్వంచరూరల్‌: విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు, పోస్ట్‌మెట్రిక్‌, ప్రీ మెట్రిక్‌ హాస్టళ్లలో సోమవారం నాటికి వందశాతం హాజరు ఉండాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్‌ ఆదేశించారు. పాల్వంచలోని గిరిజన బాలికల పోస్టు మెట్రిక్‌ వసతి గృహాన్ని, బాలుర ఆశ్రమ పాఠశాలను శనివారం ఆయన సందర్శించారు. హాస్టల్‌ గదులు, డార్మెటరీ, డైనింగ్‌ హాల్‌, బాతురూమ్‌లు, వంటగదులు, వసతి గృహాల పరిసరాలను పరిశీలించారు. సిబ్బంది, విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాలలకు చేరుకునేలా హెచ్‌ఎంలు, వార్డెన్‌లు చర్యలు తీసుకోవాలన్నారు. పరిసరాల పరిశుభ్రత పాటించాలని, డ్రెయినేజీలు, బాత్‌రూమ్‌లు శుభ్రంగా ఉంచాలని, పిల్లలకు రక్షిత తాగునీరు అందించాలని చెప్పారు. నూతన మెనూ ప్రకారం ఆహారం అందించాలని ఆదేశించారు. హాస్టళ్లలో మరమ్మతులు ఉంటే ప్రతిపాదనలు రూపొందించాలని చెప్పారు. వేసవి సెలవుల అనంతరం హాస్టళ్లకు వచ్చిన విద్యార్థులు ప్రస్తుత వాతావరణం మార్పుతో అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని, వార్డెన్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. హెచ్‌ఎంభద్రు, వార్డెన్లు తదితరులు పాల్గొన్నారు.

రూ.1.62 కోట్లు కొల్లగొట్టిన కేసులో ఇంకొకరి అరెస్టు

ఖమ్మం క్రైం: ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ ద్వారా అధిక లాభాలు వస్తాయని నమ్మించి సుమారు రూ.1.62 కోట్ల మేర మోసం చేసిన కేసులో మరో నిందితుడిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసు కమిషనర్‌ సునీల్‌దత్‌ తెలిపారు. బోనకల్‌ మండలానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌కు ఫోన్‌ చేసిన ముఠా సభ్యులు దితులు అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి వాట్సప్‌, ట్రేడింగ్‌ లింక్‌ల ద్వారా సుమారు రూ.1.62 కోట్లు జమ చేయించారు. ఆతర్వాత ముఖం చాటేయడంతో మోసపోయిన గుర్తించిన బాధితుడు ఖమ్మం సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. దీంతో డబ్బు జమ అయిన అకౌంట్‌ ఆధారంగా ఇప్పటికే నలుగురిని అరెస్ట్‌ చేయగా, నేనావత్‌ అఖిల్‌ను నాగర్‌కర్నూల్‌ జిల్లాలో అరెస్టు చేసి ఖమ్మం సైబర్‌ క్రైం కోర్టులో హాజరుపర్చాక రిమాండ్‌కు తరలించినట్లు సీపీ తెలిపారు. కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన సైబర్‌ క్రైం డీఎస్పీ ఫణీందర్‌, ఎస్సైలు రంజిత్‌కుమార్‌, విజయ్‌కుమార్‌, సిబ్బందిని ిసీపీ అభినందించారు.

సంస్కృత పండితుడికి సన్మానం1
1/1

సంస్కృత పండితుడికి సన్మానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement