
కారు పల్టీ: కమిషనర్కు తీవ్రగాయాలు
ఇల్లెందు: ఇల్లెందు మున్సిపల్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ రోడ్డు ప్రమాధంలో గాయపడ్డారు. శుక్రవారం అర్ధరాత్రి ఇల్లెందు నుంచి కొత్తగూడెం వెళ్తున్న ఆయన కారు టేకులపల్లి మండలం బోరింగు తండా వద్ద పల్టీ కొట్టింది. దీంతో కమిషనర్కు తీవ్రగాయాలయ్యా యి. అటుగా వెళ్తున్నవారు గమనించి సమాచారం ఇవ్వటంతో ఆయన్ను కుటుంబ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది ఖమ్మం తరలించారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న కమిషనర్ను మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మడత వెంకట్గౌడ్ తదితరులు పరామర్శించారు. కాగా కమిషనర్ శ్రీకాంత్ ఆరు నెలల కాలంలో రెండోసారి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.
రోడ్డు ప్రమాదంలో
వైద్య విద్యార్థినులకు గాయాలు
కొత్తగూడెంఅర్బన్: ఆటో బోల్తా పడి ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థినులు గాయపడ్డ ఘటన శుక్రవారం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థినులు ప్రయాణిస్తున్న ఆటో కేఎస్ఎం దగ్గర అదుపు తప్పి పల్టీ కొట్టింది. దీంతో ఓ విద్యార్థిని కాలు విరిగింది. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను కొత్తగూడెంలోని సర్వజన ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై కళాశాల ప్రిన్సిపాల్ను ఫోన్లో వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. వారు స్పందించలేదు.
ఎదురెదురుగా బస్సు, ఆటో ఢీ
కామేపల్లి: కామేపల్లి మండలం ముచ్చర్ల క్రాస్ సమీపాన శనివా రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి వివరాలు... మహబూబాబాద్ జిల్లా గార్ల నుంచి లింగాల మీదుగా ఖమ్మం వైపు ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు, ఖమ్మం నుంచి నలుగురు ప్రయాణికులతో ఇల్లెందు వైపు వెళ్తున్న ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ సలీంతో ఆటోలో ప్రయాణిస్తున్న షేక్ మహబూబ్, హలీమా, సోందుబీ, జర్పుల కమలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఎస్సై సాయికుమార్, సిబ్బందితో చేరుకుని క్షతగాత్రులను 108లో ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యలోనే కొణిజర్ల మండలం గుబ్బగుర్తికి చెందిన షేక్ సోందుబీ(68) మృతి చెందింది. అలాగే చికిత్స చేయిస్తుండగా గాదెపాడుకు చెందిన అంగన్వాడీ టీచర్ షేక్ మహబూబ్(48) కన్నుమూసింది. అంతేకాక అలాగే, సలీం(ఇల్లెందు) పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా, కమల(గాదెపాడు)కు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు.
విత్తన వ్యాపారికి షోకాజ్ నోటీస్
సుజాతనగర్: అనుమతులు లేని చోట విత్తనాలు విక్రయిస్తూ పట్టుబడిన సుజాతనగర్కు చెందిన విత్తన వ్యాపారికి జిల్లా వ్యవసాయాధికారి బాబూరావు షోకాజ్ నోటీస్ జారీ చేసినట్లు ఏఓ జి.నర్మద శనివారం తెలిపారు. విత్తన వ్యాపారి శివ నాయక్ నిబంధనలకు విరుద్ధంగా చండ్రుగొండ మండలంలో విత్తనాలు విక్రయిస్తూ పట్టుబడటంతో కేసు నమోదైందని, దీంతో షోకాజ్ నోటీసు అందజేసినట్లు పేర్కొన్నారు.
ఇద్దరు మహిళల మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం

కారు పల్టీ: కమిషనర్కు తీవ్రగాయాలు